Kota Srinivasa Rao: సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు అటు సీరియస్ విలన్ గాను ఇటు కామెడీ విలన్ గాను ఇంకో వైపు కన్నీళ్లు పెట్టించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేయగలనని నిరూపించుకున్న నటుడు. తనకంటూ విలక్షణమైన నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న కోటా ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే అపుడపుడు కొత్త సినిమాల గురించి అలనాటి సినిమాల జ్ఞాపకాలను పలు ఇంటర్వ్యూలలో పంచుకుంటున్నారు. అలానే ఇపుడు వస్తున్న భారీ బడ్జెట్ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
బాహుబలి ఎంతమందికి గుర్తుంది….
కంటెంట్ బాగుంటే సినిమా ఎంత చిన్నదైనా పెద్దదైనా చూడాలని సూచించారు. ఇపుడు తెలుగు సినిమా పాన్ ఇండియా ట్రెండ్ వైపు చూస్తోంది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, వంటి సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెలుగు సినిమా గౌరవాన్ని పెంచాయి. ఇది చెప్పుకోవడానికి బాగుంటుంది అంతే. కొన్నేళ్ళ క్రితం ‘బాహుబలి’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రికార్డులను బద్దలు కొట్టింది. రాజమౌళి ఇంత పెద్ద హిట్ సినిమా చేయడం తెలుగువారి అదృష్టం. కానీ ఈరోజు సినిమా ఎవరికి గుర్తుంది?” ఈ విజయాలన్ని తాత్కాలికమే. ఒకప్పుడు 6నెలల వరకు సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఇక 1957 లో వచ్చిన ఎపిక్ ఫాంటసీ డ్రామా మాయాబజార్ సినిమాను ఇప్పటికి టీవీ లో వస్తే అందరు ఉత్సాహంగా చూస్తారు అలాగే అందులో వాడిన మెలకువలను గురించి మాట్లాడుకుంటున్నారు.
భారీ బడ్జెట్ అంటూ విసుగుపుట్టిస్తున్నారు….
ఇక ఇప్పటి భారీ బడ్జెట్ సినిమాలపైన కామెంట్స్ చేసారు. ఒకప్పుడు నిర్మాణ వ్యయం గురించి అసలు బయటికి వచ్చేది కాదని, ఇప్పుడు కోటి రూపాయలు ఈ ఒక్క సన్నివేశానికి పెట్టామని ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. కంటెంట్ బాగుంటే సినిమా పెద్దదైన చిన్నదైనా చూస్తారు. కంటెంట్ బాగుంటేనే హీరో ఎవరైనా సినిమా చూస్తారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నారని సినిమా హిట్ అవ్వదు. కథ ఉంటేనే, సినిమా నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది. జనం కొన్న టికెట్ కి ఎంటర్టైన్మెంట్ వసూలు అయ్యిందా లేదా అనేదే ఇక్కడ లెక్క అని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…