Indraja: నటి ఇంద్రజ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి, జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ఇంద్రజ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ ఆదివారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ వీడియో ద్వారా ఇంద్రజను ప్రశ్నిస్తూ.. మీ జీవితంలో క్రిటికల్ సిచువేషన్ ఏది అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఇంద్రజ సమాధానం చెబుతూ 1998 లో ఇంద్రజ తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేసి ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అదే సమయంలోనే తన తల్లికి కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని వెంటనే సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు.చేతిలో రూపాయి కూడా లేదు అమ్మకు సర్జరీ ఎలా చేయాలో దిక్కు తెలియడం లేదనీ ఇంద్రజ తెలిపారు.
ఆ సమయంలో నేను పనిచేస్తున్న కంపెనీలో ఇచ్చిన రెండు చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. ఎవరిని అడగాలో తెలియని అయోమయంలో ఉన్నాను. ఆ సమయంలో నా నగలని తాకట్టు పెట్టి అలా ఏదో చేసి అమ్మకు ఆపరేషన్ చేయించాము. అలా అమ్మను బ్రతికించు ఉన్నామని అయితే ప్రస్తుతం తన తల్లి తనకు దూరం అయ్యారని ఇంద్రజ తన కన్నీటి కష్టాలను కార్యక్రమం ద్వారా తెలియజేశారు.
తన జీవితంలో చాలా క్రిటికల్ సిచువేషన్ అదేనని అప్పటి నుంచి తన లైఫ్ లో మనీ అనేది సెకండరీగా మారిపోయిందని ఈమె వెల్లడించారు. నాకు ఈ సిచువేషన్ ఎదురైన తర్వాత ఎంత బాధ పడ్డానో నాకే తెలుసు అందుకే ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే తన దగ్గర డబ్బు ఉంటే ఏ మాత్రం ఆలోచించకుండా వారికి ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…