Political News

“పవన్‌ కల్యాణ్‌ స్పందించి ఉంటే డ్రైవర్‌ హత్య జరిగేది కాదు”: కోటా వినూత దంపతులు సంచలన ఆరోపణలు

చెన్నై/శ్రీకాళహస్తి: డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల విచారణలో కోటా వినూత దంపతులు సంచలన విషయాలను వెల్లడించారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తమ సమస్య గురించి ముందే తెలుసని, ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదని వారు ఆరోపించారు. శ్రీనివాస్ వద్ద తమ వ్యక్తిగత వీడియోలు ఉన్నందునే ఈ హత్య జరిగిందని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

Kota Vinootha couple make sensational allegations

వినూత దంపతుల ఆరోపణలు ఇలా ఉన్నాయి:

“టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మా బెడ్ రూంలో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్‌ను ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ రూ.30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి విక్రయించాడు. వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయించారు. ఈ విషయం తెలియగానే మేము శ్రీనివాస్‌ను పని నుంచి తొలగించాము.” అని వినూత దంపతులు పోలీసులకు వివరించారు.

పవన్‌ కల్యాణ్‌కు ముందే సమాచారం ఇచ్చినా..

“ఆ విషయాన్ని వెంటనే అప్పటి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చెప్పాం. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. పవన్ కల్యాణ్ గారు వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే శ్రీనివాస్ హత్య వరకు వచ్చేది కాదు” అని చెన్నై పోలీసుల విచారణలో కోటా వినూత దంపతులు స్పష్టం చేశారు.

డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో ఈ కొత్త ఆరోపణలు కేసును మరింత సంక్లిష్టంగా మార్చాయి. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

telugudesk

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago