Krishna House Maid : సూపర్ స్టార్ కృష్ణ గారు అశేష తెలుగు అభిమానులను శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారు. శరీరంలోని అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోవడం తో ఆయన మరణించినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. నవంబర్ 14 న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణగారికి చికిత్స అందించిన వైధ్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించకపోవడం వల్ల నవంబర్ 15 తెల్లవారు జామున ఆయన మరణించారు. ఇక ఆయన మరణ వార్త వినగానే ఆయన అభిమానులు హైదరాబాద్ చేరుకున్నారు. ఇక కృష్ణ గారు అలాగే విజయనిర్మల గారి గొప్పతనం గురించి వారి దగ్గర పనిచేసిన లక్ష్మమ్మ మాట్లాడారు.
మా అమ్మాయిని సొంత కూతురులా చూసుకున్నారు…
పద్మాలయా స్టూడియోస్ లో దాదాపు 40 ఏళ్లుగా పనిచేసిన లక్ష్మమ్మ కాలు విరగడంతో ప్రస్తుతం మూడేళ్ళ నుండి పనిచేయడం లేదని అంతకుముందు అక్కడే పనిచేసాని చెప్పారు. కాలు విరిగి హాస్పిటల్ లో ఉన్నపుడు కూడా మేనేజర్ ను పంపించి ఆర్థిక సహాయం చేసారు. ఇక మా అమ్మాయి కృష్ణ గారి తమ్ముడి ఇంట్లో వంట చేస్తుంది. తన పెళ్లి, ఆమె పిల్లలు, చదువులు వారి పెళ్లిళ్లు అన్నీ చేశారు. మా మనవళ్ల పెళ్లిళ్లకు కూడా కృష్ణ విజయనిర్మల గారు వచ్చారు. మా పిల్లల పెళ్లిళ్ల సమయంలో బంగారం, డబ్బు సహాయం విజయ నిర్మల గారు చేసారు అంటూ లక్ష్మమ్మ తెలిపారు.
ఇక విజయనిర్మల గారు చనిపోయిన తరువాత కృష్ణ గారి ఇంటికి వెళితే నరేష్ అమ్మ చనిపోయిందని ఇక రావడం మనొద్దు లక్ష్మమ్మ అప్పుపడప్పుడు వస్తుండు అంటూ చెప్పాడట. ఆయన కూడా బాగా పలకరిస్తాడు అంటూ లక్ష్మమ్మ చెప్పారు. కృష్ణ గారి తో మాట్లాడాలంటే చాలా భయం వేసేది ఆయన పెద్ద హీరో అని కానీ ఆయన బాగా మాట్లాడిస్తారు, సాధారణంగా ఉంటారు అంటూ చెప్పారు. ఆయన చనిపోయారని తెలిసి చూడాలనుకున్నా కానీ అంత జనంలో వెళ్ళాలేవు అన్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు లక్ష్మమ్మ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…