Senior Actor Kavitha : చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు ఇలా అన్ని భాషలలోనూ హీరోయిన్ గా చేసిన కవిత గారు తెలుగులోనూ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ చాలా సినిమాల్లో నటించిన ఆమె అటు రాజకీయాల్లో ఉంటూనే నటి గా సీరియల్స్ లోనూ కనిపిస్తూ నటనను కంటిన్యూ చేస్తున్నారు. ఇక అప్పటి ఇండస్ట్రీ ముచ్చట్లు, గొడవల గురించి తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఆ ఆర్టిస్ట్ పొట్ట మీద చేయి వేయడంతో బాగా తిట్టాను…
షూటింగ్ సమయంలో చిన్న చిన్న గొడవలు మామూలే అంటూ చెప్పిన కవిత గారు రీ ఎంట్రీ టైములో తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నపుడు ఒక ఆర్టిస్ట్ తన పొట్టమీద చేయి వేసి కవిత కి పొట్ట లేదు అని మిగతా వాళ్లకి చెప్పాడు. అలా నా పొట్ట మీద చాయి వేసి అనేసరికి నాకు బాగా కోపం వచ్చి అక్కడే తిట్టాను. మీ భార్యను కూడా వేరేవాళ్ళు చేయి వేసి మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది అని తిట్టేసరికి ఆ సినిమాలోని స్టార్ హీరో వచ్చి సర్ది చెప్పాడు. ఇక ఆషూటింగ్ లో అంతా ఆ ఆర్టిస్ట్ నావైపు ఎవరైనా వస్తుంటే జాగ్రత్తగా మాట్లాడండి ఆ కవిత కోపం ఎక్కువ అంటూ అనేవాడు అంటూ చెప్పారు.
ఇక ఇప్పటి హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు హీరోయిన్స్ గా ఉన్న శ్రీదేవి, జయప్రద, జయసుధ నేను అందరం కూడా అప్పట్లో జీరో సైజు లో ఉండేవాళ్ళము, ఏ డైట్ అవి పాటించలేదు. కొద్ది పాటి ఎక్స్ర్సైజులతో మెయిన్టైన్ చేసాము. ఇప్పుడు మితిమీరిన డైట్, వర్కౌట్స్ తో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మీరందరూ అందగా ఉన్నారు ఇంకా సన్నబడి ఏదో చేయాలనుకుంటే ఎలా, ఆరోగ్యం ముఖ్యం కదా అది చూసుకోవాలి. హీరోయిన్స్ కే కాదు బయట యువతకు కూడా ఇది వర్తిస్తుంది అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…