Krishna makeupman Madhava rao : ఎటువంటి ప్రయోగాలకైనా ముందుండి మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు తెరకు కొత్తరకం సినిమాలను పరిచయం చేసిన ఆయన ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఎన్టీఆర్ తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆంధ్ర జేమ్స్ బాండ్ గా నిలిచిన ఆయన నేడు అశేష తెలుగు అభిమానులను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అయన నవంబర్ 15న మల్టీపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల మరణించారు. ఎక్కడినుండో కుటుంబాలు కుటుంబాలు ఆయనను కడసారి చూడటానికి వస్తారని ఎవరూ అంచనా వేయలేదు. ఆయన అంతిమ యాత్రలో ఎంతోమంది పాల్గొని వారి అభిమానాన్ని చాటారు. ఇక ఆయన గురించి ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తో, ఇక కుటుంబం ఎలా ఉండేవారో ఆయనకు మేకప్ మాన్ గా పనిచేసిన మాధవరావు గారు తెలిపారు.
మహేష్, నరేష్ మధ్య అభిప్రాయ బేధాలు…
మాధవరావు గారు మొదటి నుండి కృష్ణగారికి మేకప్ మాన్ గా ఉండేవారు. దాదాపు ‘శ్రీ శ్రీ’ సినిమా వరకు ఆయనే పనిచేసారు. మాధవరావు గారు కృష్ణ, ఇందిరా దేవి గారు, విజయనిర్మల గారి గురించి మాట్లాడుతూ వారిద్దరూ ఎన్నో దాన ధర్మాలను చేశారంటూ చెప్పారు. విజయనిర్మల గారు చనిపోయే ఏడాది ముందు నేను ఇల్లు కొనుక్కోవాలంటే ఇరవైఐదు లక్షలు ఇచ్చారు. అప్పుగా తీసుకుని మళ్ళీ ఇచ్చేస్తాసినని చెప్పినా ఏమి వద్దు నువ్వు ఎంత సర్వీస్ చేసుంటావు మాకు అన్నారు, వారిద్దరి గొప్పతనం అది అంటూ చెప్పారు.
ఇక ఇందిరా గారు అన్న అంటూ పిలిచేవారని చెప్పారు. ఇక విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకున్న తరువాత ఇందిర, కృష్ణ గారికి నలుగురు పిల్లలు పుట్టారు. వాళ్లంతా కలిసి పెరిగారు. పెళ్లి సమయానికి నరేష్ చిన్న పిల్లవాడు ఇక నరేష్ ను కృష్ణ గారు బాగా చూసుకున్నారు. అందరూ కలిసే పెరిగారు. మహేష్ కి నరేష్ కి మధ్య ఎప్పుడూ అభిప్రాయ బేధాలు లేవు, అందరూ బాగానే ఉండేవారు అంటూ మాధవరావు గారు తెలిపారు.
నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…
తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…