Senior Journalist imandhi Ramarao : సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించి ఇంకా వారమైనా గడవక ముందే అప్పుడే సోషల్ మీడియాలో ఆయన ఆస్తుల గురించి ఇవి ఎవరికి చెందుతాయి, నరేష్ కి వాటా ఉంటుందా అనే అంశాల మీద జోరుగా చర్చ నడుస్తోంది. ఇక కృష్ణ గారి డైరీలో అసలు ఏమి రాశారు, ఎవరికి ఆస్తి ఇచ్చారు అనే అంశాల మీద అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఈ విషయాల గురించి విశ్లేషించారు.
ఆస్తులు ఎవరి సొంతం…
కృష్ణ గారు సంపాదించిన ఆస్తి విషయంలో పెద్ద పీట పెద్ద కుమారుడు రమేష్ బాబుకే ఉంటుంది. ఆయన మరణించినా ఆయన వ్యాపారంలో సంపాదించినది, ఇక తన భార్య తరుపున వచ్చిన ఆస్తి చాలానే ఉన్నా కృష్ణ గారి పెద్దకుమారుడిగా సింహ భాగం ఆయనదే అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఇక కూతుర్లలో మంజుల గారికి కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. గల్లా జయదేవ్ భార్య, అలాగే సుధీర్ బాబు భార్య బాగున్నారు. ఆర్థికంగా ఆ కుటుంబాలు బాగున్నాయి.
కానీ మంజుల గారు సినిమాలను నిర్మించడం వల్ల కొంత నష్టపోయారు, అందుకే ఆమెను గురించి కృష్ణ అలోచించి ఉండవచ్చు అంటూ చెప్పారు. ఇక మహేష్ వాటా ఖచ్చితంగా మహేష్ కు ఉంటుంది అంటూ చెప్పారు. ఇక నరేష్ కి రక్త సంబంధం లేకపోయినా తన వెన్నంటే ఉన్నందున అందులోనూ విజయనిర్మల మీద ఉన్న ప్రేమతో నరేష్ కు కొంత ఆస్తి ఇవ్వచ్చు, అవకాశం ఉంది, వేల కోట్ల ఆస్తులు వారికి ఉన్నాయి కాబట్టి అందరికీ న్యాయం చేస్తారు అంటూ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…