Featured

Krishnam Raju : నాతో చెప్పిన రోజే లండన్ వెళ్లి ఉంటే బ్రతికివుండేవారేమో… కృష్ణంరాజు చనిపోవడానికి అసలు కారణం అదే : నిర్మాత చిట్టి బాబు

Krishnam Raju : ఒకప్పటి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలు నాలుగు స్థంబాలుగా ఏళుతున్న రోజులలో కృష్ణంరాజు తనదైన గంబీరమైన నటనతో రెబల్ స్టార్ గా అభిమానులలో స్థానం సంపాదించుకున్నాడు. కృష్ణం రాజు కొన్ని అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 11 ఆదివారం తెల్లవారుజామున స్వర్గస్థులైన సంగతి తెలిసిందే. ఈయన ఆఖరి చూపు కోసం సినీ రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. ఆయనకు ఆప్తుడు అయిన నిర్మాత చిట్టి బాబు కృష్ణంరాజు స్వగృహానికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పించి కుటుంబానికి ధైర్యం చెప్పారు.

అపుడే వెళ్లి ఉంటే బ్రతికేవారేమో…

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిట్టి బాబు కృష్ణం రాజు తో తన అనుబంధం గురించి ఆయన చావుకు గల కారణాలు గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చివరిగా ఆయనను కొన్ని నెలల క్రితం కలిసాను అని చెప్పారు. ‘రాధే శ్యామ్’ సినిమా తరువాత నాకు ఫోన్ చేసి సినిమా ఎలా ఉంది అని అడిగితే వెళ్లి మాట్లాడాను అని చెప్పుకొచ్చారు. అపుడే ఆయన నాతో కొంచం అనారోగ్య సమస్యలు ఉన్నాయి, లండన్ కి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారట, అయితే ఎందుకు ఆలస్యం వెంటనే వెళ్లొచ్చు కదా అని కూడా చెప్పాను అని కానీ ఇక్కడే కొన్ని టెస్టులు చేయించుకొని వెళ్తాను అని చెప్పారు, అపుడే వెళ్లి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు.

అసలు కృష్ణం రాజు గారికి ఏం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని ప్రశ్నించగా… ఆయనకు షుగర్ ఉంది, పైగా వయసు కూడా 83 సంవత్సరాలు కావడంతో హాస్పిటల్ లో చేరాక కిడ్నీలు రెండు ఫెయిల్ అవ్వడం తో ఆయన మరణించారు అని చెప్పుకొచ్చారు. ఆగష్టు 5 న చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరారు, చికిత్సలో ఉండగానే సెప్టెంబర్ 11 న ఆయన మరణించారు అని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ పది మందికి భోజనం పెడుతూ ఆయన తినే వారు, నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది, నన్ను చిట్టీ అని పిలిచేవారు, ఆయన మరణం ప్రభాస్ కు తీరని లోటు అని నిర్మాత చిట్టీ బాబు చెప్పుకొచ్చారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago