Movie News

Krishnam Raju: చివరి కోరిక తీరుకుండానే చనిపోయిన కృష్ణంరాజు!

Krishnam Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు నేడు తుది శ్వాస విడిచారు. నటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 180 సినిమాలకు పైగా నటించిన ఈయన తీవ్ర అనారోగ్య సమస్యలతో నేడు ఉదయం ఏఐజి హాస్పిటల్ లో మృతి చెందారు. ఇక ఈయన మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయనకు అందరూ అమ్మాయిలు కావడంతో తనకు వారసులు లేరనే బాధలు ఈయన తన తమ్ముడి కుమారుడు ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఇలా ఈశ్వర్ సినిమా ద్వారా ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కృష్ణంరాజు ప్రతి సినిమాలు తనకు చేదోడు వాదోడుగా ఉంటూ తనని ఇండస్ట్రీలో ప్రోత్సహించారు.

ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ అగ్రనటుడుగా కొనసాగడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ను చూసి కృష్ణంరాజు ఎంతో పొంగిపోయారు. అయితే ప్రభాస్ విషయంలో కృష్ణంరాజుకు తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది.

Krishnam Raju: ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలని ఉంది..

కృష్ణంరాజు కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని, తన పిల్లలతో ఆడుకోవాలని కోరిక ఉందని తెలిపారు. ఈ విధంగా ప్రభాస్ పెళ్లి కోసం అమ్మాయిని చూస్తున్నామని త్వరలోనే శుభవార్త చెబుతామంటూ ఈయన వెల్లడించారు. అయితే ప్రభాస్ పెళ్లి చూడకుండానే, ఆయన పిల్లలతో ఆడుకోకుండానే కృష్ణంరాజు మృతి చెందారని ఆయన కోరిక తీరకుండానే మృతి చెందారని తెలుస్తోంది. ఇక కృష్ణంరాజు మరణ వార్త తెలియగానే ఎంతోమంది ప్రభాస్ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

చక్రి మరణంపై షాకింగ్ నిజాలు.. రఘు కుంచె క్లారిటీ

దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…

14 minutes ago

ఇలా కూర్చుంటే రక్తపోటు పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్!

ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…

26 minutes ago

దేవుడికి నమస్కారం చేస్తే ఎందుకు కళ్లు మూసుకుంటాం? అసలు కారణం ఇదే!

దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…

56 minutes ago

తెలంగాణలో ఎవరి జనాభా ఎక్కువ?.. కుటుంబ సర్వేలో బిగ్ రివీల్

తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…

1 hour ago

అమావాస్య వెనుక ఉన్న పురాణ కథ తెలుసుకుంటే ఆశ్చర్యమే!

ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…

1 hour ago

అంతర్జాతీయ విజయాల కోసం తిరుమల చేరుకున్న పీవీ సింధు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…

2 hours ago