Krishnam Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు నేడు తుది శ్వాస విడిచారు. నటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 180 సినిమాలకు పైగా నటించిన ఈయన తీవ్ర అనారోగ్య సమస్యలతో నేడు ఉదయం ఏఐజి హాస్పిటల్ లో మృతి చెందారు. ఇక ఈయన మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయనకు అందరూ అమ్మాయిలు కావడంతో తనకు వారసులు లేరనే బాధలు ఈయన తన తమ్ముడి కుమారుడు ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఇలా ఈశ్వర్ సినిమా ద్వారా ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కృష్ణంరాజు ప్రతి సినిమాలు తనకు చేదోడు వాదోడుగా ఉంటూ తనని ఇండస్ట్రీలో ప్రోత్సహించారు.
ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ అగ్రనటుడుగా కొనసాగడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ను చూసి కృష్ణంరాజు ఎంతో పొంగిపోయారు. అయితే ప్రభాస్ విషయంలో కృష్ణంరాజుకు తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది.
కృష్ణంరాజు కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని, తన పిల్లలతో ఆడుకోవాలని కోరిక ఉందని తెలిపారు. ఈ విధంగా ప్రభాస్ పెళ్లి కోసం అమ్మాయిని చూస్తున్నామని త్వరలోనే శుభవార్త చెబుతామంటూ ఈయన వెల్లడించారు. అయితే ప్రభాస్ పెళ్లి చూడకుండానే, ఆయన పిల్లలతో ఆడుకోకుండానే కృష్ణంరాజు మృతి చెందారని ఆయన కోరిక తీరకుండానే మృతి చెందారని తెలుస్తోంది. ఇక కృష్ణంరాజు మరణ వార్త తెలియగానే ఎంతోమంది ప్రభాస్ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…