General News

మహబూబ్ నగర్ చిన్నారులను ఆదుకోవాలని కలెక్టర్ కు ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్!

సాధారణంగా చిన్నపిల్లలకు తెలిసీ తెలియని వయసులో తల్లిదండ్రులు అండగా ఉండాలీ. కానీ అలాంటి పసిపిల్లలను అనాధలను చేసి ఆ తల్లిదండ్రులు అనంతలోకాలకు వెళ్లిపోతే.. ఆ పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తల్లిదండ్రులు ఇక లేరు, ఇకపై తిరిగి రారన్న విషయం తెలియక ఆ చిన్నారులు పడే మనోవేదన వర్ణనాతీతం. అయితే ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో దంపతులు ఇద్దరు మృతి చెందడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. అసలేం జరిగిందంటే…

మహబూబాబాద్ జిల్లాకు చెందిన దంపతులు విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో వారి ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. దీనికి సంబంధించి వార్త ఓ పత్రికలో రావడంతో ఇదే కథనాన్ని ట్యాగ్ చేస్తూ ఆ చిన్నారులను ఆదుకోవాలని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులకు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఆ చనిపోయిన ఆ దంపతులు మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉండేవారు.అనపర్తి ఉపేందర్(32), తిరుపతమ్మ(32) దంపతులకు శ్యామల(8), బిందు(6) అనే ఇద్దరమ్మాయిలు కూడా ఉన్నారు.అయితే శుక్రవారం రోజు రాత్రి తిరుపతమ్మ బట్టలను ఆరేసే క్రమంలో జీఐ వైర్‌కు విద్యుత్ షాక్ ప్రసారం అవ్వడంతో షాక్ తగిలింది.ఇది చూసిన ఆమె భర్త ఉపేందర్ ఆమె కాపాడటానికి ప్రయత్నించాడు.

అయితే ఈ క్రమంలోనె ఆమెని కాపాడే ప్రయత్నంలో ఉపేందర్ కూడా విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడు. ఇద్దరు దంపతులు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దంపతులు కుమార్తెలు శ్యామల, బిందు కలసి తన తల్లిదండ్రుల అంత్యక్రియలలో ముందు నడిచారు. ఆ చిన్నారుల మనోవేదన చూసి ఇరుగు పొరుగు వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తల్లిదండ్రుల పై పడి ఆ చిన్నారులు గుండెలవిసేలా రోదించారు. ఇక ఇదే విషయంపై వీరిద్దరి అంత్యక్రియల్లో శ్యామల, బిందునే ముందు నడిచారు.దీనితో ఆ ఇద్దరు చిన్నారులకు అండగా నిలవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆదేశంతో పలువురు అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

9 hours ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

2 days ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

2 days ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

2 days ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

2 days ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

2 days ago