General News

మహబూబ్ నగర్ చిన్నారులను ఆదుకోవాలని కలెక్టర్ కు ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్!

సాధారణంగా చిన్నపిల్లలకు తెలిసీ తెలియని వయసులో తల్లిదండ్రులు అండగా ఉండాలీ. కానీ అలాంటి పసిపిల్లలను అనాధలను చేసి ఆ తల్లిదండ్రులు అనంతలోకాలకు వెళ్లిపోతే.. ఆ పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తల్లిదండ్రులు ఇక లేరు, ఇకపై తిరిగి రారన్న విషయం తెలియక ఆ చిన్నారులు పడే మనోవేదన వర్ణనాతీతం. అయితే ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో దంపతులు ఇద్దరు మృతి చెందడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. అసలేం జరిగిందంటే…

మహబూబాబాద్ జిల్లాకు చెందిన దంపతులు విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో వారి ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. దీనికి సంబంధించి వార్త ఓ పత్రికలో రావడంతో ఇదే కథనాన్ని ట్యాగ్ చేస్తూ ఆ చిన్నారులను ఆదుకోవాలని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులకు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఆ చనిపోయిన ఆ దంపతులు మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉండేవారు.అనపర్తి ఉపేందర్(32), తిరుపతమ్మ(32) దంపతులకు శ్యామల(8), బిందు(6) అనే ఇద్దరమ్మాయిలు కూడా ఉన్నారు.అయితే శుక్రవారం రోజు రాత్రి తిరుపతమ్మ బట్టలను ఆరేసే క్రమంలో జీఐ వైర్‌కు విద్యుత్ షాక్ ప్రసారం అవ్వడంతో షాక్ తగిలింది.ఇది చూసిన ఆమె భర్త ఉపేందర్ ఆమె కాపాడటానికి ప్రయత్నించాడు.

అయితే ఈ క్రమంలోనె ఆమెని కాపాడే ప్రయత్నంలో ఉపేందర్ కూడా విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడు. ఇద్దరు దంపతులు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దంపతులు కుమార్తెలు శ్యామల, బిందు కలసి తన తల్లిదండ్రుల అంత్యక్రియలలో ముందు నడిచారు. ఆ చిన్నారుల మనోవేదన చూసి ఇరుగు పొరుగు వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తల్లిదండ్రుల పై పడి ఆ చిన్నారులు గుండెలవిసేలా రోదించారు. ఇక ఇదే విషయంపై వీరిద్దరి అంత్యక్రియల్లో శ్యామల, బిందునే ముందు నడిచారు.దీనితో ఆ ఇద్దరు చిన్నారులకు అండగా నిలవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆదేశంతో పలువురు అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

6 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

6 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

6 hours ago

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…

6 hours ago

“మహిళల ఉసురు తగులుతుంది”.. అమిత్ షా ఫైర్‌తో రాజకీయాల్లో హీట్

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…

6 hours ago

శ్రీరాముడిపై నాగబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా వేడెక్కిన చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…

7 hours ago