L. B. Sriram : కమెడియన్ గా అందరికి బాగా తెలిసిన ఎల్బి శ్రీరామ్ గారు మంచి హాస్యనటుడే కాదు గొప్ప రైటర్ కూడా. ఆయన డైలాగు రైటర్ గా సినిమాలకు పనిచేసారు. విభిన్న మైన డైలాగు డెలివరీతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఆయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బ్యానర్ మీద షార్ట్ ఫిలిమ్స్ ను తీస్తున్నారు. సినిమాల్లో ఇస్తున్న మూస పాత్రలను చేయడం ఇష్టం లేక వాటి నుండి తప్పుకున్నాను అంటూ శ్రీరామ్ చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ సినిమాల్లో అవకాశల కోసం కష్టపడిన ఎల్బి శ్రీరామ్ గారు ప్రస్తుతం కవి సామ్రాట్ అనే షార్ట్ ఫిల్మ్ ను ఆహా ఒరిజినల్స్ లో చేశారు. ఒక మూస పాత్రలతో ఇమడలేక చాలా సినిమాలను వదులుకున్న ఆయన ప్రస్తుతం రచయిత గా షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
హలో బ్రదర్ తరువాత అవకాశాలు….
మొదటగా కోకిల, ఏప్రిల్ ఒకటి విడుదల, అప్పుల అప్పారావు, హిట్లర్, హలో బ్రదర్ వంటి సినిమాలకు రైటర్ గా పనిచేసిన ఎల్బి శ్రీరామ్ గారు హలో బ్రదర్ వంటి సినిమా తరువాత పెద్ద సినిమా అవకాశాలను అందుకోలేదు. అధికాక ఈవివి గారి తో అప్పటివరకు పనిచేసిన ఆయన ఆ తరువాత ఆయనతో కలిసి పనిచేయలేదు. వారి మధ్య ఏమైనా విబేధాలు ఉన్నాయా అనే విషయం మీద శ్రీరామ్ గారు క్లారిటీ ఇచ్చారు. ఈవివి గారితో కలిసి పనిచేసిన ఆయన హలో బ్రదర్ మంచి హిట్ తరువాత కుడా గ్రూప్ లో ఉన్నానట్టు చెబుతూ మా మధ్య ఇలాంటో విబేధాలు లేవు కానీ ఆయన పెద్ద డైరెక్టర్ ఆయన నిర్మాతల ఇష్టాలనతోనో లేక హీరోల అభిరుచుల మేరకో వేరే రచయితలను పెట్టుకుని ఉండవచ్చు.
అధికాక నేను కుడా నాకు పలానా సినిమాలో రాసే అవకాశం ఇవ్వమని అడగలేదు అలా జరిగిపోయింది. నేను ఇండస్ట్రీ కి వచేసిన మొదట్లో కష్టపడ్డపుడు అనుకున్నధానికంటే ఎక్కువ విజయాన్నే చూసాను. తినాలనుకున్న దానికంటే ఒక ముద్ద ఎక్కువే తిన్నాను ఆ సంతృప్తి ఉంది. ఇక నటుడుగా రచయితగా కుడా సక్సెస్ చూసాను. ఉండాల్సిన దానికంటే రెట్టింపు సంతోషంగా ఉన్నాను ఇంకా ఏమి కావాలి అందుకే ఏ రోజు నాకు పలానా వాళ్ళు అవాకాశం ఇవ్వలేదని బాధపడను అడగను అంటూ చెప్పారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…