Pawan Kalyan: బ్రో సినిమా విషయంలో నేను ఎన్నో తిట్లు తిన్నాను.. పవన్ కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చి రాజకీయాలపై ఎంతో ఫోకస్ పెట్టారు. త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం రాజకీయాలపైనే ఉంది. ఇలా రాజకీయాలలో భాగంగా ఈయన వచ్చే ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు వచ్చే ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఇదివరకు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. గతంలో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గెలుపొందలేకపోయారు. అయితే ఈసారి మాత్రం పక్క గెలవాలని ఉద్దేశంతో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల రాజకీయ పార్టీలలో జనాలు లేకపోతే పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ లను ఉపయోగిస్తూ జనాలను పెడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నాకు సినిమాలలో కూడా గ్రాఫిక్స్ వాడటం ఇష్టం లేదని తెలిపారు.

గ్రాఫిక్స్ ఇష్టం లేదు…
ఇలా సినిమాలలోనే నాకు గ్రాఫిక్స్ వాడటం ఇష్టం లేదని అయినప్పటికీ బ్రో సినిమా విషయంలో తాను ఎన్నో తిట్లు తిన్నానని తెలిపారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఏ మాత్రం బాగాలేదు అంటూ చాలామంది నన్ను తిట్టారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.