Ap Politics: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చాలా వేడి మీద కొనసాగుతూ ఉన్నాయి. ఆంధ్ర రాజకీయాలు ఎప్పుడు కూడా ఆసక్తికరంగా ఉంటాయని సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల హడావిడి కావడంతో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతూ ఉన్నాయి.
ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు వైసిపి నుంచి టీడీపీకి టిడిపి నుంచి వైసీపీకి వలసలు వెళ్తున్నారు. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇరువురి పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే ఈ గొడవలను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సొంత బాయ్ బాయ్ మీదే గొడ్డలి వేటు వేసి దక్కించుకున్నటువంటి అధికారం ఈసారి పోతుందన్న భయంతోనే వైకాపా నేతలు గొడ్డలి ఎత్తుతూ దాడులకు పాల్పడుతున్నారని ఈయన కామెంట్లు చేశారు. జగన్ ఆయన సైకో సైన్యానికి ఇవే ఆఖరి రోజులని లోకేష్ తెలిపారు.
ఇవే ఆఖరి రోజులు..
ఇటీవల గిద్దలూరు మండలం గడికోటకు చెందిన మునయ్య వైకాపా నుంచి టిడిపిలోకి రావడంతో వైకాపా నేతలు తనని బెదిరించి గొడ్డలితో దారుణంగా నరికి చంపడంతో లోకేష్ ఈ విధమైనటువంటి ట్వీట్ చేశారు. తప్పకుండా తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సురక్షితంగా ఉంటారని రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అంటూ ఇటీవల ప్రచార కార్యక్రమాలలో లోకేష్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…