AP politics: ఎన్నికల హడావిడి మొదలవడంతో అధికార పక్షంపై ప్రతిపక్షం ప్రతిపక్షంపై అధికారపక్షం మాటల యుద్ధం చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే అధికార పార్టీ నేత, వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల మహాదోపిడి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పుస్తకంలో చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి గురించి ఉందని ఈయన తెలియచేశారు ఆయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ప్రలోభ పెట్టి ఎలా దోపిడీ చేశారనే విషయాలు ఇందులో స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల పేరుతో భారీ స్థాయిలో దోపిడీ చేశారని సజ్జల పేర్కొన్నారు.
ఈ విధంగా చంద్రబాబు నాయుడు దోపిడీ చేయడం కోసం వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేసారు అనే విషయాలను కూడా ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించి ఉందని తెలిపారు. రాజకీయం అంటే సంక్షేమం కాదని దోపిడీ అనే సరికొత్త నిర్వచనం చంద్రబాబు నాయుడు తెలియచేసారని వెల్లడించారు. ఇక అధికారం కోసం చంద్రబాబు బిజెపి పవన్ కళ్యాణిని వాడుకుంటున్నారని తెలిపారు.
అధికారం కోసం ఆఖరి ప్రయత్నం..
అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారని ఈయన ఎద్దేవా చేశారు. ఇక ఇటీవల షర్మిల అధికార ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడే మాటలను ప్రజలు గమనిస్తున్నారని ఈమె ఇలా మాట్లాడుతుంది అంటే స్క్రిప్ట్ చంద్రబాబు నుంచే వస్తుందని ఈయన తెలియజేశారు. మన దేశానికి అవినీతిని పరిచయం చేసినదే చంద్రబాబు నాయుడు అని ఆయన రాజకీయ లబ్ధి కోసం సొంత భార్యను కూడా వాడుకున్నారు అంటూ ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…