Laywer Gandla Rathna Rao : ఎటువంటి ప్రయోగాలకైనా ముందుండి మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు తెరకు కొత్తరకం సినిమాలను పరిచయం చేసిన ఆయన ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఆంధ్ర జేమ్స్ బాండ్ గా నిలిచిన ఆయన నేడు అశేష తెలుగు అభిమానులను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అయన నవంబర్ 15 న మల్టీపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల మరణించారు. ఎక్కడినుండో కుటుంబాలు కుటుంబాలు ఆయనను కడసారి చూడటానికి వస్తారని ఎవరూ అంచనా వేయలేదు. ఆయన అంతిమ యాత్రలో ఎంతోమంది పాల్గొని వారి అభిమానాన్ని చాటారు. ఇక ఆయన మరణం తరువాత ఆయన వీలునామా లో ఏమి రాశారు, కృష్ణ వెన్నంటే ఎపుడు ఉండే నరేష్ కి ఆస్థిలో వాటా ఉంటుందా, కోర్ట్ కి వెళితే ఏమి జరుగుతుంది అనే విషయాల గురించి క్లారిటీగా లాయర్ రత్నరావు గారు వివరించారు.

అస్థి కోసం కోర్టుకు వెళితే జరిగేది అదే…
రత్న రావు గారు మాట్లాడుతూ కృష్ణ గారు వీలునామా గనుక రాసి అందులో ఎవరికి ఆస్తి చెందాలని ఉంటే వారికే ఆస్తి దక్కుతుంది. అలా కాకుండా ఇప్పుడు పంచుకోవాల్సి వస్తే ఇండియన్ చట్టం ప్రకారం ఆయన సొంతబిడ్డలు ఆడపిల్లలు మగపిల్లలకు సమానంగా ఆస్తి పంపకం జరుగుతుంది. ఇక హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రెండో వివాహం మొదటి భార్య అనుమతితో జరిగినా లేక దాపరికంగా జరిగినా మొదటి భార్య బ్రతికే ఉంటే ఆ పెళ్లి చెల్లదు. ఆమెకు ఆస్థిలో వాటా ఉండదు. అయితే ఒకవేళ రెండో భార్యకు అతని వల్ల సంతానం కలిగితే వారికి ఆస్థిలో వాటా హక్కు ఉంటుంది.

అయితే ఇక్కడ విజయ నిర్మల గారి అబ్బాయి నరేష్ కృష్ణ గారికి పుట్టిన వ్యక్తి కాదు కాబట్టి ఆస్థిలో వాటా ఉండదు. ఒకవేళ ఆయనకు ఆస్థిలో వాటా ఇవ్వలేదని కోర్ట్ కి వెళ్లినా అక్కడ కూడా చెల్లదు, చట్టం ఆలా లేదు. కొన్ని ఇతర దేశాలలో ఉంది కానీ ఇండియాలో అలాంటి చట్టం లేదు. వాళ్ళు సెంటిమెంట్ గా ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు, ఒకవేళ వీలునామా లో కృష్ణ గారు రాసుంటే నరేష్ కు ఆస్తి వస్తుంది అంటూ రత్నరావు గారు చెప్పారు.






























