Bramhanandam : తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది టాప్ హీరోలు ఉండొచ్చు, ఒక్కో హీరోకి కోట్లలో అభిమానులు ఉండొచ్చు కానీ అదే హీరోకి యాంటీ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు. కానీ యాంటీ ఫ్యాన్స్ అంటూ లేనేలేని వ్యక్తి ఇండస్ట్రీలో బ్రహ్మనందం. మన తెలుగు ప్రేక్షకులైతే చిన్న పెద్ద తేడా లేకుండా బ్రహ్మీ అని పిలుచుకుంటారు. 1956 ఫిబ్రవరి 1 న జన్మించిన కన్నెగంటి బ్రహ్మానందం గారు మొదట లెక్చరర్ గా తొమ్మిదేళ్లు పనిచేసారు. ఆ తరువాత తాతావతారం సినిమాలో నటించారు. ఆ తరువాత జంధ్యాల గారి అహ నా పెళ్ళంట సినిమాలో అరగుండు పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఆ తరువాత బ్రహ్మానందం లేని తెలుగు సినిమా ఉండదా అనేంతగా ఆయన పాపులర్ అయ్యారు.
కోట్ల విలువ చేసే ఆస్తులు….
ఇక బ్రహ్మానందం గారు ఒక దశలో బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. ఆయన లేని సినిమా లేదు అనేంతగా నటించారు. ఒక్కో కాల్షీట్ కి లక్షరూపాయల పారితోషకం తీసుకునేవారు బ్రహ్మీ. అలా ఒక్కో సినిమాకు దాదాపు కోటి దాక రెమ్యూనరేషన్ ఉండేది. హీరోల తరువాత అత్యధిక పారితోషకం తీసుకునే వ్యక్తి బ్రహ్మీనే. ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించడం తగ్గించారు బ్రహ్మానందం గారు. కానీ మీమ్స్ రూపంలో వాట్సాప్ స్టిక్కర్స్ రూపంలో ఆయన మనకు చేరువవుతూనే ఉన్నారు. ఇక ఆయన సంపాదించిన డబ్బులన్నీ భూములపైనే పెట్టుబడి పెట్టారు.
అలా సుమారుగా 500 కోట్ల రూపాయల ఆస్తులను ఆయన కూడబెట్టారని వినికిడి. ఇక ఆయన కుమారుడు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా హీరోగా సక్సెస్ కాలేదు. ఇక బ్రహ్మీ గారికి ఉన్న మరో టాలెంట్ ఈ లాక్ డౌన్ టైం లో అందరికి తెలిసింది. అదే ఆయన మంచి చిత్రకారుడు. అలా లాక్ డౌన్ సమయంలో ఆయన గీసిన చిత్రాలను పలువురు హీరోలకు కానుకగా పంపారు. ఆయా హీరోలు ఆ చిత్రాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం వల్ల ఈ విషయం బయటికి వచ్చింది.
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికులు ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. దేశం కోసం తమ…
తెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందిన రియాలిటీ షోల్లో బిగ్బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన గతంతో పోలిస్తే ఎంతో పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇస్తున్నారు.…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చిత్రాల్లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ…
టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా ఒకటి. దర్శకుడు…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…