M.M Keeravani: ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలో వివిధ రంగాలలో అద్భుతమైన సేవలను కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మా పురస్కారాలను అందిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విశిష్టమైన సేవలు అందించిన 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించారు.
ఇందులో ఆరుగురు పద్మవిభూషణ్ అవార్డు అందుకోగా, 9 మందికి పద్మభూషణ్, 91 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేశారు.ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీకి ఎంతో సేవలు చేసినటువంటి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారు.
కీరవాణి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకోగా తాజాగా ఈ సినిమా కీర్తి కిరీటంలోకి మరొక అవార్డు వచ్చి చేరింది.ఈ సినిమా సంగీత దర్శకుడిగా అద్భుతమైన బాణీలు సమకూర్చిన ఎం ఎం కీరవానికి పద్మశ్రీ పురస్కారం లభించింది.
ఇక ఈ సినిమాలో నాటు నాటు పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడమే కాకుండా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచింది ఇలా తాజాగా మరోసారి ఈ పాటకు సంగీతం అందించిన కీరవానికి పద్మశ్రీ పురస్కారం రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనసు మమత చిత్రంతో తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన కీరవాణి ఇప్పటివరకు11 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఇందులో 8 ఉత్తమ సంగీత దర్శకుడిగా అందుకోగా మూడు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా అవార్డులు అందుకున్నారు.తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోగా ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. త్వరలోనే ఈయన ఆస్కార్ అవార్డును కూడా అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…