బాలకృష్ణ – నాగబాబుల వివాదం టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. మంచికి పోతే చెడు ఎదురైందని సామెత ఇప్పుడు టాలీవుడ్ కి వర్తించేలాగే ఉంది. కరోనా లాక్ డౌన్ వలన తెలుగు చిత్రసీమ ఎదుర్కొంటున్న సమస్యలకో పరిష్కారం చూపడానికి మెగాస్టార్ చిరంజీవి మరికొందరు చొరవ తీసుకుని షూటింగ్ లు ప్రారంభించే విషయమై ప్రభుత్వంలో చర్చలు జరుపుతున్న నేపద్యంలో ప్రముఖ నటుడు, హిందుపూర్ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపగా, దానికి నాగబాబు కౌంటర్ మరింత సంచలనం సృష్టించింది.
అయితే నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ట్స్ అసోసియేషన్ వారు బాలకృష్ణను సమావేశాలకు పిలిచి ఉండాల్సిందని కామెంట్ చేశారు. ఇందుకు మూవీ ఆర్టిస్ట్స్ అద్యక్షుడు నరేష్ స్పందిస్తూ, తననే ఆ మీటింగ్ కు పిలవలేదని, అలాగే మా సెక్రటరీని కూడా పిలవలేదని, అలాంటప్పుడు తాము బాలకృష్ణను ఎలా పిలుస్తామని ప్రశ్నించారు. సి.కళ్యాణ్ వ్యాఖ్యలు తమను షాక్ కు గురి చేశాయని అన్నారు.
ఇదిలావుండగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వద్ద కూర్చుని భూములు పంచుకుంటారా అని సినీ ప్రముఖులను ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యానించగా, ఎపిలో టిడిపి వారు చేసిన రియల్ ఎస్టేట్ స్కామ్ వల్ల సామాన్యులు నాశనం అయ్యారని నాగబాబు సంచలనంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రోజురోజుకీ ముదురుతున్న ఈ మాటల యుద్ధం క్లైమాక్స్ ఎలా వుంటుందో వేచి చూద్దాం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…