మాధవిలత “నచ్చావులే” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని సినిమాలు చేసి నటనకు కాస్త విరామం తీసుకుని రాజకీయాలలో అడుగుపెట్టింది. గత ఎన్నికల్లో బిజెపి తరుపున పోటి చేసింది ఓటమిపాలైంది. అయితే నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈ భామ అప్పడప్పుడు కొన్ని వివాదాస్పద కామెంట్లు కూడా చేస్తుంటారు. ఈ నేపధ్యంలో తాజగా లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్న కొంతమందిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మాధవిలత.
వివరాల్లోకి వెళితే “పెళ్ళికి ముహూర్తం మళ్ళి రాదా? ఇప్పుడు కాకపొతే వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవచ్చు కదా.. పిల్ల దొరకదా? పిల్లోడు పారిపోతడా? అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకు? మాస్క్ ల ముసుగులో పెళ్ళి అవసరమా? కొన్నాళ్ళు ఆగలేని వీరు సంసారాలు చేస్తారా?” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్టు పై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. నీకెందుకు ఆని కొందరు.. సూపర్ చెప్పావ్ మాధవీలత ఆని మరికొందరు ఇలా రకరకాల కామెంట్లు పెడుతూ తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. అయితే మాధవిలత తాజగా పెళ్లి చేసుకున్న యువహీరోను ఉద్దేశించే ఈ పోస్టు పెట్టిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…