ఒకే కుటుంబంలోని ఐదుగురు మహిళలు ఉన్నఫలంగా అదృశ్యమయ్యారు. వీరు కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు కింద ఈ మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే దర్యాప్తును కొనసాగిస్తున్న పోలీసులకు నెల రోజుల తర్వాత ఎంతో భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అదృశ్యమైన మహిళలు ఏమయ్యారు అనే విషయాలను దేవాస్ పోలీసులు తెలియజేశారు.
మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాకు చెందిన మమతా, ఆమె ఇద్దరు కుమార్తెలు రూపాలీ (21), దివ్య (14), మరో ఇద్దరు బాలికలు మే 13 నుంచి కనిపించకుండాపోయారు. మమత పెద్ద కుమార్తె రూపాలీ అదే గ్రామానికి చెందిన సురేంద్ర చౌహన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే సురేంద్ర చౌహన్ మరొక అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న రూపాలీ సురేందర్ ఫోటో, అతని ఫోన్ నెంబర్ ఫేస్ బుక్ లో ఆయనే తనకు కాబోయే భర్త అంటూ పోస్ట్ చేసింది. రూపాలీ ఈ విధంగా ప్రవర్తించడం తో ఎంతో ఆగ్రహం చెందిన సురేందర్ ఎలాగైనా ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు.
ఈ క్రమంలోనే రూపాలి కుటుంబాన్ని హత్య చేసి వారి శవాలు పోలీసులకు దొరకకుండా వేర్వేరు గ్రామాలలో పాతి పెట్టాడు. అదేవిధంగా పోలీసులకు అనుమానం రాకుండా శవాల మీద ఉన్న దుస్తులను తొలగించి వాటిని కాల్చివేశాడు. శవాలు దుర్వాసన రాకుండా ఉండటం కోసం ఉప్పు, యూరియా వేసి పాతి పెట్టాడు.
ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలువురిపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.సురేంద్ర చౌహన్ పథకం వేయడంతో వీరు కేవలం శవాలను పాతి పెట్టడానికి మాత్రమే సహాయం చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే శవాలను ఎక్కడ పాతి పెట్టారు అనే విషయాలను తెలుసుకుని వాటిని వెలికి తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…