ఒకే కుటుంబంలోని ఐదుగురు మహిళలు ఉన్నఫలంగా అదృశ్యమయ్యారు. వీరు కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు కింద ఈ మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే దర్యాప్తును కొనసాగిస్తున్న పోలీసులకు నెల రోజుల తర్వాత ఎంతో భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అదృశ్యమైన మహిళలు ఏమయ్యారు అనే విషయాలను దేవాస్ పోలీసులు తెలియజేశారు.
మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాకు చెందిన మమతా, ఆమె ఇద్దరు కుమార్తెలు రూపాలీ (21), దివ్య (14), మరో ఇద్దరు బాలికలు మే 13 నుంచి కనిపించకుండాపోయారు. మమత పెద్ద కుమార్తె రూపాలీ అదే గ్రామానికి చెందిన సురేంద్ర చౌహన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే సురేంద్ర చౌహన్ మరొక అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న రూపాలీ సురేందర్ ఫోటో, అతని ఫోన్ నెంబర్ ఫేస్ బుక్ లో ఆయనే తనకు కాబోయే భర్త అంటూ పోస్ట్ చేసింది. రూపాలీ ఈ విధంగా ప్రవర్తించడం తో ఎంతో ఆగ్రహం చెందిన సురేందర్ ఎలాగైనా ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు.
ఈ క్రమంలోనే రూపాలి కుటుంబాన్ని హత్య చేసి వారి శవాలు పోలీసులకు దొరకకుండా వేర్వేరు గ్రామాలలో పాతి పెట్టాడు. అదేవిధంగా పోలీసులకు అనుమానం రాకుండా శవాల మీద ఉన్న దుస్తులను తొలగించి వాటిని కాల్చివేశాడు. శవాలు దుర్వాసన రాకుండా ఉండటం కోసం ఉప్పు, యూరియా వేసి పాతి పెట్టాడు.
ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలువురిపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.సురేంద్ర చౌహన్ పథకం వేయడంతో వీరు కేవలం శవాలను పాతి పెట్టడానికి మాత్రమే సహాయం చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే శవాలను ఎక్కడ పాతి పెట్టారు అనే విషయాలను తెలుసుకుని వాటిని వెలికి తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నట్లు తెలిపారు.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…