Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇలా సినిమా షూటింగ్ పనులలో మహేష్ బాబు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం విరామం దొరికిన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఇక సాధారణంగా మహేష్ బాబు బయట పార్టీలకు పెద్దగా అటెండ్ అవ్వరు కేవలం సన్నిహితుల పార్టీలకు మాత్రమే వస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ఒక పార్టీలో సందడి చేశారని తెలుస్తుంది.
ఉపాసన కజిన్ సిస్టర్ శ్రియ భూపాల్ గురించి అందరికీ తెలిసిందే.ఈమె అఖిల్ తో నిశ్చితార్థం చేసుకుని అనంతరం బ్రేకప్ చెప్పుకొని మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇక శ్రీయ భూపాల్ బేబీ షవర్ వేడుకలలో భాగంగా మహేష్ బాబు నమ్రత అలాగే కూతురు సితార పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బేబీ షవర్ వేడుకలలో భాగంగా మహేష్ బాబు బ్లాక్ కలర్ టీ షర్ట్ ధరించి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారని చెప్పాలి. ఈ ఫోటోలను షేర్ చేసిన మహేష్ వాట్ ఏ ఫన్ నైట్ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ఇక నమ్రత సైతం ఇదే ఫోటోలను షేర్ చేస్తూ చాలా రోజుల తర్వాత ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకున్నామని చాలా సంతోషంగా పార్టీ జరిగిందని తెలిపారు. ఇక మొదటిసారి తన కుమార్తెతో కలిసి పార్టీకి వెళ్లానని తను కూడా తన తండ్రి లాగే చాలా అల్లరి చేస్తుంది అంటూ నమ్రత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…