Producer Avula Giri : డిస్ట్రిబ్యూటర్ గా ఖుషి, నరసింహా నాయుడు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆవుల గిరి ఆపైన నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. శ్రీఆంజనేయం, కలుసుకోవాలని, నా అల్లుడు, ఆంధ్రవాలా, సై వంటి సినిమాలను నిర్మించిన ఆయన ప్రస్తుతం సినిమా నిర్మాణంకి సినిమాలకు దూరంగా ఉన్నారు. వివాదాలకు దూరంగా సినిమాలను నిర్మిస్తూ డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా ఎదిగిన ఆవుల గిరి కొన్ని కాంబినేషన్స్ ఎలా ఆగిపోయాయో ఇండస్ట్రీలో ఎలాంటి పాలిటిక్స్ జరుగుతాయో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
బాలకృష్ణ తిట్టాడు…
నరసింహా నాయుడు సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న ఆవుల గిరి గారు ఆ సినిమాపై అంచనాల కంటే గోపాల్ గారి మీద నమ్మకంతో సినిమా తీసుకున్నానని చెప్పారు. ఆ సినిమా 100 రోజులు ఆడే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని విడుదలకు సిద్ధమైంది. థియేటర్ కావాలని అడగడంతో నరసింహా నాయుడు తీసేసి ఆ సినిమా వేద్దామని అనుకున్నాం. తారక్ మొదటి సినిమా కదా వేయాలని అనుకున్నాం.
అయితే నేను మంచిర్యాలలో ఏదో వేడుకలో ఉంటే బాలకృష్ణ గారు ఫోన్ చేసి బాగా తిట్టారు. దాంతో సినిమాను కొనసాగించాం. కానీ నిన్ను చూడాలని సినిమాకు థియేటర్ ఇస్తామని మాటిచ్చామని పక్కన వేరే థియేటర్ ఇచ్చేలా మరో డిస్ట్రిబ్యూషన్ వాళ్ళతో మాట్లాడాం. అప్పట్లో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ చాలా బాగా పనిచేసుకునేవాళ్ళం. ఇప్పుడు స్వార్థం పెరిగిపోయి నేనే తినాలి అనే భావన ఎక్కువయపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి అంటూ ఆవుల గిరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…