Prabhas: సినీ నటుడు ప్రభాస్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రభాస్ సాంప్రదాయంగా పట్టు పంచ చొక్కా ధరించి నేడు ఉదయం సుప్రభాత సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఇలా స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం తీసుకున్నారు.
వేద పండితుల ఆశీర్వాదం అనంతరం స్వామివారి పట్టు వస్త్రాలను తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇలా స్వామివారి దర్శనం అనంతరం ఈయన ఆలయం వెలుపలకి రావడంతో ఒక్కసారిగా అభిమానులు ప్రభాస్ తో సెల్ఫీలు దిగడం కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే ప్రభాస్ ఆది పురుష్ సినిమా ద్వారా జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో నేడు తిరుపతిలో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుకలో పాల్గొనడం కోసం తిరుపతి చేరుకున్నటువంటి ప్రభాస్ స్వామి వారి దర్శనం కోసం తిరుమల వెళ్లారు.
నేడు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ పాల్గొనబోతున్నారు. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…