Mahesh Babu: కరోనాతో బాధపడుతున్నా.. నెల చిన్నారికి ప్రాణదానం చేసిన మహేష్ బాబు..!
Mahesh Babu: సాధారణంగా సినిమాలలో హీరోల పాత్రలు ఎంతో ఉదార స్వభావంగా ఉంటాయి. సినిమాలలో వీరి పాత్రలు కష్టాల్లో ఉన్న వారిని చూసి చలించిపోతూ వారికి సహాయం చేసే విధంగా వీరి పాత్రలను సృష్టిస్తారు. అయితే సినిమాలలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో మంది రియల్ హీరోలుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరని చెప్పవచ్చు.
మహేష్ బాబు సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, ఎన్నో రకాల బిజినెస్ ల ద్వారా పెద్దమొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఈయన సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని ఇతరులకు సహాయం చేయడం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్ బాబు ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ బాబు ఒక చిన్నారి ప్రాణాలను కాపాడినట్లు తెలుస్తోంది.
జాంబవంతుల శిరీష అనే మహిళ నెలరోజుల క్రితం ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డకు గుండె సమస్య ఉండడంతో ఆ బిడ్డకు సర్జరీ చేయాలంటే అధిక మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది ఈ క్రమంలోనే ఈ విషయం మహేష్ బాబుకి తెలియజేయడంతో ఈ హీరో ఆ బిడ్డపట్ల చొరవ తీసుకుని ఆంధ్ర హాస్పిటల్ యాజమాన్యంతో సంప్రదించి ఆ బిడ్డకు పూర్తి చికిత్సను అందించారు.ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉండడంతో తనని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారని ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇప్పటివరకు మహేష్ బాబు 1050 మంది పిల్లల ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నమ్రత ఆంధ్ర హాస్పిటల్ వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహేష్ బాబు ప్రస్తుతం కరోనా బారిన పడిన సంగతి మనకు తెలిసిందే.తన కరోనా బారిన పడినప్పటికీ ఓ చిన్నారి ప్రాణాలను నిలబెట్టడం తో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…