మెగాస్టార్ చిరంజీవి తన రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే “ఖైదీ నెంబర్ 150” చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తరువాత “సైరా నరసింహారెడ్డి” ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ప్రస్తుతం చిరంజీవి తన 153 వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 కావడంతో తన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ నటించబోయే 154 వ చిత్రానికి సంబంధించి తాజా ప్రకటన తెలియజేశారు.
మెగాస్టార్ తన 154వ చిత్రంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో “వేదాళం” సినిమాకు రీమేక్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలోనే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను చిత్రబృందం తెలియజేశారు. ఈ సందర్భంగా ఈసినిమాకు “భోళాశంకర్”అనే టైటిల్ ను ఖరారు చేసారు.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేసారు. మెగాస్టార్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో అజిత్ హీరోగా నటించిన టువంటి “వేదాళం” సినిమా ఎంతో విజయవంతమైంది. తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ముందుగా పవన్ కళ్యాణ్ హీరోగా చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించే అవకాశం మెగాస్టార్ కి వచ్చింది.
వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న “భోళాశంకర్” సినిమాలో మెగాస్టార్ చిరంజీవి విభిన్నమైన లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలి పాత్ర ఎంతో కీలకమైనదని, ఈ కీలక పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తుందనే సమాచారం వినబడుతుంది. మొత్తానికి మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా తన 154 వ చిత్రానికి సంబంధించిన టైటిల్ ని తెలియజేయడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…