టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR” చిత్రం లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య”ఈ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చివరిదశ షూటింగ్ లో ఉన్నాయి.ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ఈ చిత్రం గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన ఎవరు జోడి కట్టబోతున్నారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే పలువురు పేర్లు వినిపించినప్పటికీ ప్రస్తుతం తెర పైకి మాత్రం కియారా అద్వానీ పేరు వినబడుతోంది.
రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ కి జోడీగా కియారా ఆడిపాడుతున్నారనే వార్త వినబడుతోంది.ఇది వరకే వీరిద్దరి కాంబోలో “వినయ విధేయ రామ”తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. తిరిగి ఈ భారీ ప్రాజెక్టులో ఈ జోడి మరోసారి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్,క్యాస్టింగ్ ఫైనలైజేషన్ లో ఉంది. చరణ్ తన రెండు సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ అంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…