టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR” చిత్రం లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య”ఈ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చివరిదశ షూటింగ్ లో ఉన్నాయి.ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ఈ చిత్రం గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన ఎవరు జోడి కట్టబోతున్నారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే పలువురు పేర్లు వినిపించినప్పటికీ ప్రస్తుతం తెర పైకి మాత్రం కియారా అద్వానీ పేరు వినబడుతోంది.
రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ కి జోడీగా కియారా ఆడిపాడుతున్నారనే వార్త వినబడుతోంది.ఇది వరకే వీరిద్దరి కాంబోలో “వినయ విధేయ రామ”తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. తిరిగి ఈ భారీ ప్రాజెక్టులో ఈ జోడి మరోసారి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్,క్యాస్టింగ్ ఫైనలైజేషన్ లో ఉంది. చరణ్ తన రెండు సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ అంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.
మన రోజువారీ జీవితంలో నిద్రకు ఉపయోగించే దిండు (Pillow) గురించి చాలా మంది పెద్దగా ఆలోచించరు. మంచిగా కనిపిస్తే, మృదువుగా…
ఐపీఎల్ 2026 సీజన్లో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. వేలంలో పెద్దగా డిమాండ్ లేకపోయిన ఒక ఆటగాడు, ఇప్పుడు మైదానంలో తన…
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. వరుస పరాజయాలు జట్టుపై ఒత్తిడిని…
ప్రసవం తర్వాత మహిళల శరీరంలో అనేక హార్మోనల్ మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల ప్రభావం చర్మం, శక్తి స్థాయి మాత్రమే…
ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది.…
కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని సాధారణంగా భావిస్తారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో, డీహైడ్రేషన్ తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అయితే…