Malli Pelli: మళ్లీ పెళ్లి ప్రస్తుతం సంచలనంగా మారిన ఈ సినిమా కోసం ఎంతో మంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు.స్టార్ సెలబ్రిటీలు కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయినటువంటి నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించిన ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని నరేష్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారని తెలుస్తోంది.
ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నరేష్ పవిత్ర లోకేష్ సైతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు ఈ సినిమాకు నరేష్ భార్య రమ్య రఘుపతి ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.
ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చాలా అభ్యంతరంగా చిత్రీకరించారని ఈమె ఆరోపణలు చేస్తూ కూకట్పల్లిలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తన పాత్రను కించపరిచే విధంగా సన్నివేశాలు తీయడంతో ఈ సినిమా విడుదలకు తాను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని ఈ సినిమా విడుదలను ఆపివేయాలి అంటూ రమ్య రఘుపతి కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఈ విధంగా రమ్య రఘుపతి మళ్లీ పెళ్లి సినిమాని విడుదల చేయకూడదంటూ కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. మరి ఈ విషయంపై నరేష్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో రమ్య రఘుపతి పాత్రలో నటి వనిత విజయ్ కుమార్ నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరించారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…