కన్న తండ్రే క్రూరమృగమై వేటాడాడు… కన్న కూతురు అని కూడా చూడకుండా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మద్యానికి బానిసై కోరిక తీర్చమని కన్న కూతురినే వేధించాడు. ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. రోజు రోజుకు వేధింపులు ఎక్కువవుతుండటంతో తల్లికి చెప్పింది బాధితురాలు. భీమవరంలోని 10వ వార్డులో జరిగిన ఈ ఘటన తీవ్ర కలలం రేపింది.
లక్ష్మీనారాయణ అనే వ్యక్తి భీమవరంలో తాపీపనులు చేస్తూ అక్కడే నివాసం సాగిస్తున్నాడు. అతని భార్య కూడా కూలిపనులు చేసుకుంటూ ఉంటుంది. వీరికి నాలుగు కూతుర్లు ఉన్నారు. ఈ మధ్యనే పెద్దమ్మాయికి పెళ్లి చేసారు.. మిగిలిన ముగ్గురు అమ్మాయిలు ఇంటి వద్దనే ఉంటున్నారు. అయితే మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ రెండో కూతుర్ని వేధింపులకు గురిచేస్తున్నాడు. మద్యం మత్తులో కోరిక తీర్చమంటూ చిత్రహింసలకు గురిచేశాడు. అయితే భయంతో బాధితురాలు విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే మరోసారి తాగి వచ్చి కూతురిని బలవంతం చేయబోయాడు దేనితో ఆమె ఒక్కసారిగా కేకలు వేసి, జరిగిన విషయం తల్లికి చెప్పింది. లక్ష్మినారాయణ అక్కడనుంచి పారిపోయాడు. ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…