Manchu Lakshmi: మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి వరుస సినిమాలు టాక్ షోలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి తాజాగా సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ చివరిగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ పలు సినిమాలకు కమిట్ అయిన ఇంకా షూటింగ్ పనులను ప్రారంభించుకోలేదు అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాకి దర్శకత్వం వహించినందుకుగాను ఉత్తమ దర్శకుడుగా న్యూయార్క్ ఫిలిం సర్కిల్స్ నుంచి రాజమౌళి ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ బెస్ట్ యాక్టర్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చోటు సంపాదించుకున్నారు.
ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులతో పోటీపడి ఎన్టీఆర్ పోటీపడి టాప్ టెన్ పొజిషన్లో ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదని చెప్పాలి. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ సెలబ్రిటీ కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. మరి ఇలాంటి ఘనత సాధించిన ఎన్టీఆర్ ను సెలబ్రిటీలు మీడియా ఏమాత్రం పట్టించుకోలేదని మంచు లక్ష్మి మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఈ విషయం గురించి మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చిన్నపాటి అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు. ప్రపంచ సినీ చరిత్రలో ఎన్టీఆర్ సాధించిన ఘనత చిన్న విషయమేమీ కాదు. తారక్ సాధించిన ఈ ఘనతకు మీ నుంచి విజిల్స్, చప్పట్లు రావాలి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…