Manchu Lakshmi:మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా విభిన్న పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె తాజాగా మోహన్ లాల్ నటించిన మాన్ స్టర్ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ సినిమాలో మంచు లక్ష్మీ నటన మరో లెవల్ కి చేరిందని ఈమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మంచు లక్ష్మి తాజాగా శ్రీకాకుళంలో సందడి చేశారు. తన తండ్రి మోహన్ బాబు సూచనలు మేరకు ఈమె శ్రీకాకుళంలోని అసరవెల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నట్లు సమాచారం.
ఇక మంచు లక్ష్మి శ్రీకాకుళం వస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని సందడి చేశారు. ఈమెకు పూల వర్షంతో స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఇలా మంచు లక్ష్మి ని చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకోవడంతో శ్రీకాకుళంలో మంచు లక్ష్మి క్రేజ్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం మంచు లక్ష్మి శ్రీకాకుళం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శ్రీకాకుళంలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్జీఓ తరుపున 475 పాఠశాలలలో స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తున్నామని రాబోయే రెండు సంవత్సరాలలో ప్రతి ఒక్కరూ ఫ్లూయెంట్ ఇంగ్లీషులో మాట్లాడతారని, ఇది వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని ఈమె వెల్లడించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…