Manchu Manoj: కరోనా బారిన పడ్డ మంచు మనోజ్.. అధికారికంగా వెల్లడించిన మనోజ్!
Manchu Manoj: కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరోసారి కొత్త వేరియంట్ రూపంలో తన పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు కమల్ హాసన్, కరీనా కపూర్, అర్జున్ వడివేలు వంటివారు ఈ మహమ్మారి బారిన పడి సురక్షితంగా కోలుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరొక యంగ్ హీరో కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది.
తాజాగా మంచు మనోజ్ కరోనా బారిన పడినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. గత వారం రోజుల నుంచి తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనోజ్ తనను కలిసిన వారికి తెలిపారు.
ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నేను క్షేమంగానే ఉన్నాను మీ ప్రేమ, ఆశీర్వాదాలు నా వెంటే ఉన్నాయి నాకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, నర్సులకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మనోజ్ ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి ఒమిక్రాన్ రూపంలో మరోసారి తన పంజా విసురుతోంది. ఇప్పటికే కరోనా బారిన పడి శివ శంకర్ మాస్టర్ మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ ప్రతి ఒక్కరు ఎంతో అప్రమత్తంగా ఉండాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…