Manchu Manoj: కరోనా బారిన పడ్డ మంచు మనోజ్.. అధికారికంగా వెల్లడించిన మనోజ్!
Manchu Manoj: కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరోసారి కొత్త వేరియంట్ రూపంలో తన పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు కమల్ హాసన్, కరీనా కపూర్, అర్జున్ వడివేలు వంటివారు ఈ మహమ్మారి బారిన పడి సురక్షితంగా కోలుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరొక యంగ్ హీరో కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది.
తాజాగా మంచు మనోజ్ కరోనా బారిన పడినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. గత వారం రోజుల నుంచి తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనోజ్ తనను కలిసిన వారికి తెలిపారు.
ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నేను క్షేమంగానే ఉన్నాను మీ ప్రేమ, ఆశీర్వాదాలు నా వెంటే ఉన్నాయి నాకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, నర్సులకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మనోజ్ ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి ఒమిక్రాన్ రూపంలో మరోసారి తన పంజా విసురుతోంది. ఇప్పటికే కరోనా బారిన పడి శివ శంకర్ మాస్టర్ మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ ప్రతి ఒక్కరు ఎంతో అప్రమత్తంగా ఉండాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…