Manchu Manoj: మంచు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో మనోజ్ ఒకరు.ఈయన కూడా ఇండస్ట్రీలో పలు హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ మధ్యకాలంలో మనోజ్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సినిమాలకు దూరంగా ఉన్నారని త్వరలోనే ఈయన కొత్త సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని వెల్లడించారు.
కడపలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అమీర్ పీన్ దర్గా గురించి అందరికీ తెలిసిందే.ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ దర్గాను దర్శించడం కోసం ఎంతోమంది సీనియర్ రాజకీయ సెలబ్రిటీలు కడపకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ సైతం శుక్రవారం కడప దర్గాను దర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి దర్గాను దర్శించుకోవాలని అనుకున్నాను ఎట్టకేలకు నా కల నెరవేరిందని తెలిపారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత తన మనసు ఎంతో ప్రశాంతంగా ఉందని మనోజ్ వెల్లడించారు. ఇక తన కెరీర్ గురించి కూడా ఈ సందర్భంగా మనోజ్ పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే తను కొత్త ప్రాజెక్ట్స్ కొత్త సినిమాలను ప్రకటించబోతున్నానని తెలిపారు. అదేవిధంగా త్వరలోనే తాను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని , త్వరలోనే కుటుంబంతో కలిసి మరోసారి కడప దర్గాను దర్శించుకుంటామని మనోజ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక మనోజ్ భూమా మౌనిక రెడ్డినీ పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇది జీవితానికి సంబంధించిన విషయం మంచి రోజు చూసుకొని చెబుతానని గతంలో చెప్పారు. ఈ క్రమంలోనే ఈయన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అర్థమవుతుంది.
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…
ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…