Manchu Manoj: మంచు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో మనోజ్ ఒకరు.ఈయన కూడా ఇండస్ట్రీలో పలు హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ మధ్యకాలంలో మనోజ్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సినిమాలకు దూరంగా ఉన్నారని త్వరలోనే ఈయన కొత్త సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని వెల్లడించారు.
కడపలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అమీర్ పీన్ దర్గా గురించి అందరికీ తెలిసిందే.ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ దర్గాను దర్శించడం కోసం ఎంతోమంది సీనియర్ రాజకీయ సెలబ్రిటీలు కడపకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ సైతం శుక్రవారం కడప దర్గాను దర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి దర్గాను దర్శించుకోవాలని అనుకున్నాను ఎట్టకేలకు నా కల నెరవేరిందని తెలిపారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత తన మనసు ఎంతో ప్రశాంతంగా ఉందని మనోజ్ వెల్లడించారు. ఇక తన కెరీర్ గురించి కూడా ఈ సందర్భంగా మనోజ్ పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే తను కొత్త ప్రాజెక్ట్స్ కొత్త సినిమాలను ప్రకటించబోతున్నానని తెలిపారు. అదేవిధంగా త్వరలోనే తాను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని , త్వరలోనే కుటుంబంతో కలిసి మరోసారి కడప దర్గాను దర్శించుకుంటామని మనోజ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక మనోజ్ భూమా మౌనిక రెడ్డినీ పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇది జీవితానికి సంబంధించిన విషయం మంచి రోజు చూసుకొని చెబుతానని గతంలో చెప్పారు. ఈ క్రమంలోనే ఈయన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అర్థమవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…