Manoj First Wife: మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే ఈయన నటించిన సినిమాలలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు. అయితే మనోజ్ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకుంటున్న తరుణంలో ఈయన పెళ్లి చేసుకోవడం, పెళ్లి జీవితంలో మనస్పర్ధలు కారణంగా పూర్తిగా తను డిస్టర్బ్ అయ్యారని చెప్పాలి.
ఇలా వ్యక్తిగత జీవితంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో సినిమా ఇండస్ట్రీ కూడా దూరమయ్యారు.మంచు మనోజ్ 2015 వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు.
ఈ విధంగా భార్యకు విడాకులు ఇచ్చినటువంటి మనోజ్ తిరిగి భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డారు. ఈయన మార్చి మూడవ తేదీ భూమా మౌనికను రెండో వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే మనోజ్ రెండో పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కాగా ప్రణతి కూడా రెండో పెళ్లి చేసుకొని ఈపాటికి భర్త పిల్లలతో సంతోషంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
ఇకపోతే ప్రణతి మనోజ్ కు విడాకులు ఇచ్చిన తర్వాత ఎక్కడుంది ఏం చేస్తుంది అనే విషయాల గురించి ఆరా తీయగా షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.మనోజ్ విడాకులు ఇచ్చిన తర్వాత ప్రణతి ఇంకొకరిని పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ కాలేదని ఆమె తన వృత్తిపరమైన జీవితంపై దృష్టి పెట్టి ప్రస్తుతం అమెరికాలో ఒంటరిగా పెళ్లి చేసుకోకుండా తన జీవితంలో ముందుకు నడుస్తున్నారని తెలుస్తోంది.ఇలా ఈమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండడంతో ఈమె ఇంకా మనోజ్ ను మర్చిపోలేకపోతున్నారా అందుకే ఇలా ఒంటరిగా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…