Journalist Satish: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడుగా మారి మొదటిసారి ఆయన దర్శకత్వం వహించిన సినిమా బలగం. ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.దిల్ రాజు ప్రొడక్షన్లో నిర్మితమైన ఈ సినిమా మౌత్ టాక్ ద్వారా మంచి సక్సెస్ అందుకుంది.
ఇలా ఈ సినిమా మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఈ సినిమా కాపీ ట్రోలింగ్స్ అంటూ పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకుంది.ప్రముఖ జర్నలిస్ట్ గడ్డం సతీష్ బలగం సినిమా కథ నాదేనని ఆరోపణలు చేశారు.ఈ కథను పచ్చికి అనే పేరుతో తాను 2011వ సంవత్సరంలో రాశానని అయితే ఈ కథ 2014లో నమస్తే తెలంగాణలో బతుకమ్మ మ్యాగజైన్లో ప్రచురితమైందని తెలిపారు.
ఇలా నేను రాసిన పచ్చికి అనే కథ ఆధారంగా ఈ సినిమా చేశారని నేను రాసిన కథలో 90% సినిమాలో ఉందని కేవలం 10 శాతం మాత్రమే మార్పులు చేశారంట గడ్డం సతీష్ పేర్కొన్నారు.సాధారణంగా ఏదైనా ఒక పాటలో కొన్ని పదాలు వాడితేనే కాపీ అంటూ పెద్ద ఎత్తున కేసులు వేస్తున్నారు. అలాంటిది నా కథను సినిమాగా చేసి కమర్షియల్ గా దిల్ రాజు సొమ్ము చేసుకుంటున్నారని ఈయన ఆరోపించారు.
ఈ విషయంపై దిల్ రాజు స్పందిస్తూ ఈ సినిమా క్రెడిట్ మొత్తం తనకు ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని అలా కాని పక్షంలో తాను చట్టపరంగా ముందుకు వెళ్తాననీ, ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్తాను అంటూ గడ్డం సతీష్ దిల్ రాజుకు సవాల్ చేశారు. ఇలా ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి కాఫీ వివాదాన్ని ఎదుర్కొంటుంది. అయితే ఇప్పటివరకు ఈ వివాదం పై దిల్ రాజు స్పందించకపోవడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…