Journalist Satish: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడుగా మారి మొదటిసారి ఆయన దర్శకత్వం వహించిన సినిమా బలగం. ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.దిల్ రాజు ప్రొడక్షన్లో నిర్మితమైన ఈ సినిమా మౌత్ టాక్ ద్వారా మంచి సక్సెస్ అందుకుంది.

ఇలా ఈ సినిమా మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఈ సినిమా కాపీ ట్రోలింగ్స్ అంటూ పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకుంది.ప్రముఖ జర్నలిస్ట్ గడ్డం సతీష్ బలగం సినిమా కథ నాదేనని ఆరోపణలు చేశారు.ఈ కథను పచ్చికి అనే పేరుతో తాను 2011వ సంవత్సరంలో రాశానని అయితే ఈ కథ 2014లో నమస్తే తెలంగాణలో బతుకమ్మ మ్యాగజైన్లో ప్రచురితమైందని తెలిపారు.
ఇలా నేను రాసిన పచ్చికి అనే కథ ఆధారంగా ఈ సినిమా చేశారని నేను రాసిన కథలో 90% సినిమాలో ఉందని కేవలం 10 శాతం మాత్రమే మార్పులు చేశారంట గడ్డం సతీష్ పేర్కొన్నారు.సాధారణంగా ఏదైనా ఒక పాటలో కొన్ని పదాలు వాడితేనే కాపీ అంటూ పెద్ద ఎత్తున కేసులు వేస్తున్నారు. అలాంటిది నా కథను సినిమాగా చేసి కమర్షియల్ గా దిల్ రాజు సొమ్ము చేసుకుంటున్నారని ఈయన ఆరోపించారు.

Journalist Satish: చట్టపరంగా ముందుకు వెళ్తా…
ఈ విషయంపై దిల్ రాజు స్పందిస్తూ ఈ సినిమా క్రెడిట్ మొత్తం తనకు ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని అలా కాని పక్షంలో తాను చట్టపరంగా ముందుకు వెళ్తాననీ, ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్తాను అంటూ గడ్డం సతీష్ దిల్ రాజుకు సవాల్ చేశారు. ఇలా ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి కాఫీ వివాదాన్ని ఎదుర్కొంటుంది. అయితే ఇప్పటివరకు ఈ వివాదం పై దిల్ రాజు స్పందించకపోవడం గమనార్హం.




























