ఇదివరకు పెళ్లిళ్లు కళ్యాణ మండపంలో, లేదా ఏదైనా దేవుని సన్నిధిలో ఇంటిదగ్గర అంగరంగ వైభవంగా జరగడం చూసే ఉంటాం. కానీ కరోనా వైరస్ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. ఆడంబరంగా చేసుకుని పెళ్లిళ్లు కనుమరుగైపోయాయి. కరోనా దెబ్బకు ఏదో పెళ్లితంతు కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. మరికొందరు కరోనా వార్డులలో సైతం పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో తాజాగా మధురైకి చెందిన ఓ జంట ఏకంగా గాల్లో పెళ్లి చేసుకున్న ఘటన తాజాగా చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
మధురైకి చెందిన రాకేష్, దక్షిణల వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం కోసం ఇరు కుటుంబ సభ్యులు ఎన్నో ఏర్పాట్లను చేశారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి మంగళవారం జరగాల్సి ఉండగా వీరు కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి మదురైకి విమానంలో పయనమయ్యారు. ఈ క్రమంలోనే తమిళనాడులో కరోనా కేసులు అధికంగా ఉండటం వల్ల మంగళవారం నుంచి సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలోని పెళ్లి కోసం ఎన్నో ఏర్పాట్లు చేసుకున్న ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లను రద్దు చేసుకున్నారు.ఇక చేసేదేమీ లేక ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో విమానంలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విధంగా కరోనా దెబ్బకు నెలలో కాకుండా నింగిలో పెళ్లి చేసుకున్న ఈ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో, పెద్దల ఆశీర్వాదంతో ఈ పెళ్లి తంతు జరిగింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…