ఇదివరకు పెళ్లిళ్లు కళ్యాణ మండపంలో, లేదా ఏదైనా దేవుని సన్నిధిలో ఇంటిదగ్గర అంగరంగ వైభవంగా జరగడం చూసే ఉంటాం. కానీ కరోనా వైరస్ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. ఆడంబరంగా చేసుకుని పెళ్లిళ్లు కనుమరుగైపోయాయి. కరోనా దెబ్బకు ఏదో పెళ్లితంతు కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. మరికొందరు కరోనా వార్డులలో సైతం పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో తాజాగా మధురైకి చెందిన ఓ జంట ఏకంగా గాల్లో పెళ్లి చేసుకున్న ఘటన తాజాగా చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
మధురైకి చెందిన రాకేష్, దక్షిణల వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం కోసం ఇరు కుటుంబ సభ్యులు ఎన్నో ఏర్పాట్లను చేశారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి మంగళవారం జరగాల్సి ఉండగా వీరు కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి మదురైకి విమానంలో పయనమయ్యారు. ఈ క్రమంలోనే తమిళనాడులో కరోనా కేసులు అధికంగా ఉండటం వల్ల మంగళవారం నుంచి సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలోని పెళ్లి కోసం ఎన్నో ఏర్పాట్లు చేసుకున్న ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లను రద్దు చేసుకున్నారు.ఇక చేసేదేమీ లేక ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో విమానంలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విధంగా కరోనా దెబ్బకు నెలలో కాకుండా నింగిలో పెళ్లి చేసుకున్న ఈ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో, పెద్దల ఆశీర్వాదంతో ఈ పెళ్లి తంతు జరిగింది.
తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…