Movie News

Marudhuri Raja : దాసరి గారు సినిమా ఎలా ఉందో చూడటానికి వచ్చి, ఆ సినిమా ఇచ్చేయమని అడిగారు : రైటర్ మరుదూరి రాజా

Marudhuri Raja : తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 200 సినిమాలకు రైటర్ గా పనిచేసిన మారుధురి రాజా స్వస్థలం గుంటూరు. మొదటి సినిమా ఒంటరి పోరాటం నుండి రైటర్ గా ఎన్నో సినిమాలకు పని చేసారు. ఈవివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, కే రాఘవేంద్రరావు వంటి దర్శకులకు ఎక్కువ సినిమాలు చేసిన రాజా తన అనుభవాలు దర్శకుడిగా చేసిన ప్రయత్నం ఎందుకు విఫలమైంది, నటుడుగా ఎందుకు రాలేదనే విషయాల గురించి స్పందించారు.

దాసరిగారు సినిమా చూడ్డానికి వచ్చి కొనాలనుకున్నారు….

మారుధురి రాజా అన్న హరనాథ రావు గారు డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీ లో ఉండటం, చిన్నతనంలో స్టేజి ప్లే బ్యాక్స్ ఎన్నో రాసిన మారుధురి రాజా సినిమా ఇండస్ట్రీకి వచ్చి రైటర్ గా కెరీర్ మొదలుపెట్టారు. అయితే మధ్యలో సినిమా డైరెక్షన్ వైపు వెళ్లాలని అనుకున్నారు. ఇక సినిమాను తీసాక దాసరి నారాయణ రావు గారు వచ్చి సినిమా మొత్తం చూసి ఆయనకు నచ్చడంతో సినిమా కొనుక్కోవాలని అనుకున్నారు. ఇక ఈవిషయంలో సినిమా నిర్మాతకు, దాసరి గారికి కొన్ని షరతుల విషయంలో తేడాలు రావడంతో దాసరి గారికి సినిమాను అమ్మలేదు. దీంతో సినిమాకు దక్కాల్సిన ఫలితం రాలేదనిపించింది.

ఈ విషయంలో నిర్మాతకి కానీ, దాసరి గారిది కానీ తప్పు కాదు. నేను డిమాండ్ చేయలేను అదే నా అసమర్ధత. అలా నేను లేకుండా ఉండుంటే బాగుండేదని చాలా సార్లు అనిపించింది. ఇప్పటి దర్శకులు అలా లేరు, ఏదైనా నిర్మాతను డిమాండ్ చేసి వాళ్లకు కావాల్సింది తీసుకుంటారు. ఇప్పటి దర్శకులు కరెక్ట్ గా ఉన్నారు అంటూ వాఖ్యణించారు. ఇక సి కళ్యాణ్, దర్శకుడు వి వి వినాయక్ బావ అని పిలుస్తారని వివరించారు. ఇండస్ట్రీలో నాకు శిష్యులు లేరు అందరు బంధువులే అని చెప్పారు. మందు తాగడం వల్ల నా వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదంటూ వివరించారు.

Bhargavi

Recent Posts

బ్రౌన్ షుగర్ నిజంగా హెల్తీనా? తెల్ల చక్కెరతో పోలిస్తే అసలు తేడా ఇదే!

ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో మనం తినే ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించే అలవాటు పెరిగింది. ముఖ్యంగా చక్కెర…

1 minute ago

రుచికోసం రిస్క్ తీసుకుంటున్నారా? చికెన్‌లో తప్పక దూరంగా ఉండాల్సిన భాగాలు!

చికెన్ అనేది భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారింది. తక్కువ ఖర్చుతో మంచి ప్రోటీన్ లభించడంతో చాలామంది వారానికి పలుమార్లు…

6 minutes ago

గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి మంచిదే… కానీ ఎంత వరకు? తెలుసుకోవాల్సిన ముఖ్య సూచనలు

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…

3 hours ago

రోజూ గుడ్డు తింటే పిల్లలకు ఏమవుతుంది? తల్లిదండ్రులకు కీలక సూచనలు!

పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…

3 hours ago

మందులు అవసరం లేదు! రోజుకు ఒక చెంచా ఈ గింజలు చాలు – శరీరానికి ఫుల్ పవర్!

ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…

3 hours ago

జేబులో గుట్కా ఉందా? తెలియకుండానే మృత్యువుకు దగ్గరవుతున్నారా!

భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…

4 hours ago