Mega Family: భోగి సంబరాలలో మెగా కుటుంబం.. వరుణ్ తేజ్ ను చూసి కుళ్లుకుంటున్న చిరు.. వీడియో వైరల్!
Mega Family: దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలను పెద్దఎత్తున ప్రారంభించారు. నేడు భోగి కావడంతో ఇప్పటికే ఎంతో మంది భోగి సంబరాలలో నిమగ్నమయ్యారు.కేవలం సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం సంక్రాంతి సంబరాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఇక ఏదైనా ప్రత్యేక పండుగ లేదా కార్యక్రమం వస్తే మెగా కుటుంబం అంతా ఒకే చోటకు చేరి పెద్ద ఎత్తున సందడి చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా కుటుంబం భోగి సంబరాలలో నిమగ్నమయ్యారు. మెగా కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట చేరి పెద్ద ఎత్తున నేడు ఉదయం భోగి మంటలు వేశారు.
ఇలా భోగిమంటల వేడుకలో పాల్గొన్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి వరుణ్ తేజ్ ఇంటి సభ్యులకు దోశలు వేసి పెట్టారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి వరుణ్ తేజ్ మధ్య ఓ సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి వరుణ్ తేజ్ ను చూసి కుళ్లుకుంటున్నట్లు తెలిపారు.
ఇలా మెగాస్టార్ చిరంజీవి వరుణ్ తేజ్ దోసెలు వేస్తూ ఉన్నటువంటి వీడియోని వరుణ్ తేజ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి దోసే చెడిపోగా వరుణ్ దోసే ఎంతో అద్భుతంగా వచ్చింది. అది చూసి కుళ్లుకుంటున్న చిరంజీవి నాకు కుళ్ళు వస్తోంది.. అంటూ వరుణ్ వేసిన దోసెను చెడగొట్టి మొత్తం ఉప్మాలా తయారు చేశాడు. అది చూసిన వరుణ్ తేజ్ నవ్వుతూ ఉండిపోయారు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘బాస్ చిరంజీవితో దోస మేకింగ్ 101.. 2022 భోగి’ శుభాకాంక్షలు అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…