Raasi: ఆ సీన్ నచ్చకపోవడంతోనే ..! బాలయ్యతో ఆ సినిమా వదులుకున్న రాశి..!
Raasi: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా సమర సింహా రెడ్డి. టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాకు శ్రీకారం చుట్టిన సినిమా ఇది. దీని తర్వాతే నరసింహ నాయుడు, ఇంద్ర వంటి సినిమాలు వచ్చి బాక్స్ ఫీస్ హిట్లను కొట్టాయి.
బాలకృష్ణ హీరోగా బీ గోపాల్ దర్శకత్వంలో 1999 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ భారీ హిట్ కొట్టింది. ఏకంగా కొన్ని సెంటర్లలో 200 రోజులు ఆడింది. కేవలం 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ రూ. 16 కోట్లు వసూలు చేసింది.
అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రావడం, బాలయ్య నట విశ్వరూపం, బీ గోపాల్ దర్శకత్వం ప్రతిభతో సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. బాలయ్య సరసన… సిమ్రాన్, అంజలా జావేరీ, సంఘవిలు నటించారు. అయితే ఇదిలా ఉంటే జనవరి 14తో సమరసింహారెడ్ది సినిమాకు 23 ఏళ్లు నిండాయి.
అయితే ఈ సినిమాలో ముందుగా అప్పట్లో ఫ్యామిలీ హీరోయిన్ గా ఉన్న రాశిని ముందుగా ఈసినిమాలో హీరోయిన్ గా అనుకన్నారట. సిమ్రాన్ స్థానంలో రాశిని కథానాయికగా తీసుకోవాలని దర్శకుడు బీ గోపాల్ అనుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల రాశి ఈ అవకాశాన్ని వదులుకుందని ఇటీవల ఓ కార్యక్రమంలో తెలిపింది. సినిమాలో ఓ సీన్ నచ్చకపోవడంతో రాశి అంత పెద్ద చిత్రాన్ని వదులుకుంది. అందులో హీరోయిన్తో సీతాకోకచిలుక సీన్ ఉంటుంది. ఆ సీన్ పట్ల రాశి అభ్యంతరం వ్యక్తం చేయడంతో దర్శకుడు నటి సిమ్రాన్ను కలిసి స్క్రిప్ట్ చెప్పాడట. ఆమెకు కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పిందట సిమ్రాన్. దీంతో సిమ్రాన్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను కూడా తీసుకువచ్చింది ఈసినిమా. ఒక వేళ రాశి ఈ సినిమాను చేసి ఉంటే.. ఆమె కెరీర్ మరోరకంగా ఉండేది. బాలయ్య వంటి స్టార్ హీరో పక్కన హీారోయిన్ గా నటించకపోవడంపై అప్పట్లో ఓవర్గం రాశిని టార్గెట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…