General News

Meghalaya Honeymoon Case: భార్య ప్లాన్ బెడిసి కొట్టిందా? ఆ ఒక్క చిన్న క్లూతో అసలు నిజం బయటపడింది!

Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ కేసు దేశంలో పెను సంచలనం సృష్టించింది. భర్తను అంతమొందించడానికి సోనమ్ వేసిన ప్లాన్ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ క్రైమ్ స్టోరీ వింటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. పెళ్లైన 15 రోజుల్లోనే భర్తను చంపించింది సోనమ్. ఈ హత్యకు తన ప్రియుడిని ఉపయోగించుకున్న విధానం షాకింగ్‌కు గురిచేస్తోంది. పోలీసులను కూడా తప్పుదోవ పట్టించేందుకు సోనమ్ చేసిన ప్రయత్నాలు ఆమెను ఒక ‘గుండెలు తీసిన బంటు’గా నిరూపిస్తున్నాయి. అసలు ప్రియుడితోనే జీవితం పంచుకోవాలనుకుంటే పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఆ తర్వాత భర్తను హత్య చేయించడం ఏమిటి? ఇప్పుడు ఈ హత్యను సమాజం ముందు ఆమె ఎలా సమర్థించుకుంటుంది?

Meghalaya Honeymoon Case.. The real truth was revealed with that one small clue!

నేరస్తులు ఎంత పెద్ద నేరం చేసినా, చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే పట్టుబడతారని అంటారు. రాజా రఘువంశీ హత్య కేసులో కూడా అతని భార్య సోనమ్ చేసిన పొరపాటే ఆమెను పట్టించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌లకు మే 11న వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం ఈ జంట మేఘాలయకు వెళ్లారు. మొదట వారు జమ్ముకశ్మీర్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, అప్పటికే అక్కడ పహల్గాంలో ఉగ్రదాడి జరగడంతో తమ ప్లాన్‌ను మార్చుకుని మేఘాలయకు వెళ్లారు.

అక్కడ రెండు రోజులు గడిచిన తర్వాత రాజా మిస్సయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 2న ఓ జలపాతం దగ్గర రాజా రఘువంశీ మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో రాజా తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు తేలింది. అయితే, ఆ ఆయుధం మేఘాలయలో ఎక్కడా ఉపయోగించనిది కావడంతో, ఈ హత్యలో బయటి వ్యక్తుల హస్తం ఉందని పోలీసులు నిర్ధారించారు.

తర్వాత కాల్ డేటా ఆధారంగా విచారణ చేయగా, హంతకులకు ఒక ఫోన్ నంబర్ నుంచి కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. ఆ ఫోన్ నంబర్ మరెవరిదో కాదు, సోనమ్ దే. ఈ ఒక్క ఆధారం దొరకడంతో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. సోనమ్ ఘాజీపూర్ నుంచి ఫోన్ చేసినట్లు గుర్తించడంతో ఆమెను అరెస్ట్ చేశారు.

రాజా రఘువంశీ మృతదేహం దొరికిన ప్రదేశంలో సోనమ్, హంతకుల ఫోన్ లొకేషన్ ఒకేలా ఉండటంతో ఆమె నేరం రుజువైంది. ఈ హత్యకు మాస్టర్ మైండ్ రాజ్ కుశ్వాహా వేరే ప్లాన్ వేశాడు. రాజా రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు.

సోనమ్ అనే మహిళ తన భర్త రాజా రఘువంశీని హత్య చేయించడానికి వేసిన పథకం గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వక మానరు. అసలు విషయం ఏమిటంటే, మే 11న రాజా, సోనమ్ ల వివాహం జరిగింది. పెళ్లయిన నాలుగు రోజులకే అంటే మే 15న సోనమ్ తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి హత్యకు పథకం వేసింది. ఎలా చంపాలో ప్లాన్ చేసుకున్నాక, మే 20న హనీమూన్ కోసం భర్తతో కలిసి షిల్లాంగ్ వెళ్లింది.

ఇక అసలు విషయానికి వస్తే, సోనమ్, రాజ్ కుష్వాహా మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను పోలీసులు తిరిగి రాబట్టారు. ఆ చాట్‌లో రాజా నుండి విడిపోయి రాజ్ కుష్వాహాతో కలిసి జీవించాలని ఉందని తేలింది. దీంతో రాజ్ కుష్వాహా తన ముగ్గురు స్నేహితులతో కలిసి రాజా రఘువంశీని హత్య చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజ్ కుష్వాహా మేఘాలయకు వెళ్లకుండానే ఈ హత్యకు ప్లాన్ చేశాడు.

ఈ విషయం తెలిసిన వాళ్లంతా ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ప్రియుడు ఉన్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఒకవేళ చేసుకుంటే భర్తను చంపించేంత క్రూరత్వం ఎలా వస్తుంది? అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే రాజ్ కుష్వాహా సోనమ్ కంటే ఐదేళ్లు చిన్నవాడు. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ కుష్వాహా మరియు అతని స్నేహితులను అరెస్టు చేశారు. సోనమ్ పాత్రపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

telugudesk

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

8 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

9 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

16 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

17 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

17 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago