Political News

Raja Singh: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..! రాజా సింగ్ సంచలన కామెంట్స్!

బీజేపీలో రాజా సింగ్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

Jubilee Hills by-election..! Raja Singh’s sensational comments!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలో కుల సమీకరణాలు పరిగణనలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. దీనిపై రాజా సింగ్ స్పందిస్తూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ టికెట్ రెడ్డి సామాజికవర్గానికే ఇస్తారా అనే చర్చ మొదలైంది. పార్టీలో సీనియర్లకు అవకాశం దక్కుతుందా లేదా అనేది చూడాలన్నారు.

మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో రాజా సింగ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు బీఆర్ఎస్‌కు అమ్మేశారని ఆరోపించారు. ఈసారి ఉప ఎన్నికలో ముస్లిం ఓట్లను ఎవరికి అమ్ముతారో చూడాలన్నారు. బీఆర్ఎస్‌కా? లేక కాంగ్రెస్‌కా? అని ప్రశ్నించారు.

అంతేకాదు, గతంలో బీజేపీలో కుల రాజకీయం జరిగిందని, ఈసారి కూడా అదే జరుగుతుందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరి పార్టీలోని సీనియర్లకు అవకాశం ఇస్తారా? లేదా? అనేది చూడాలన్నారు.

కాగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో జూబ్లీహిల్స్‌‌లో ఉప ఎన్నిక జరగనుంది.

ఇదిలా ఉంటే, రాజా సింగ్ గతంలో కూడా కిషన్ రెడ్డిపై విమర్శలు చేశారు. కిషన్ రెడ్డికి కళ్లున్నా చూడలేరు, నోరున్నా మాట్లాడలేరు అంటూ ఎద్దేవా చేశారు. దీంతో కిషన్ రెడ్డి, రాజా సింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే టాక్ వినిపిస్తోంది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago