Mehar Ramesh: మెహర్ రమేష్ ఎన్నో సినిమాలకు దర్శకుడుగా పని చేసినటువంటి ఈయన తాను దర్శకత్వం వహించిన సినిమాలలో సక్సెస్ కన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువగా చవిచూశారు.ఇలా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో ఈయనకు అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా అవకాశాలు లేనటువంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి తనకు భోళా శంకర సినిమా చేసే అవకాశాన్ని కల్పించారు.
ఇలా ఈ సినిమా ద్వారా మెహర్ రమేష్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఈ సినిమా సక్సెస్ రమేష్ కు చాలా కీలకమైనదని చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి తమన్న జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకులందరికీ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శిల్పకళా వేదికలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
తాను చిన్నప్పటి చిరంజీవి గారికి పెద్ద అభిమానిని తెలిపారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఆయనతో కలిసి ఒక సినిమా ఆయన చేయాలనేది నా కోరిక అయితే భోళా శంకర్ సినిమాతో నా కోరిక నెరవేరిందని ఈ సందర్భంగా మెహర్ రమేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే తన కథ సినిమాల పరాజయాల గురించి కూడా ఈయన పరోక్షంగా మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు..
వరుస సినిమాలు ఫెయిల్యూర్ కావడంతో ఎన్నో ఇబ్బందులలో ఉన్నటువంటి ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నా జీవితం షాడో లో ఉండిపోయింది అలాంటి నా జీవితానికి చిరంజీవి గారు వెలుగుని ఇచ్చారు ఇది నాకు పునర్జన్మ లాంటిది అంటూ ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ కామెంట్స్ చేశారు.ఇక ఈ సినిమాలో చిరంజీవి నటన చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలిపారు. అదేవిధంగా మెగా హీరోకి చెల్లెలుగా నటించాలి అంటే మెగా నటి అయి ఉండాలని భావించాను కానీ ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలుగా మహానటి లభించింది అంటూ కీర్తి గురించి కూడా ఈ సందర్భంగా మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…