ఎంఐ కంపెనీ మన దేశంలో స్మార్ట్ టీవీ ని లాంచ్ చేసింది. ఈటీవీ ఏకంగా 75 అంగుళాల పొడవు ఉంది. అదే ఎంఐ క్యూ ఎల్ఈడి టీవీ 75. మనదేశంలో లాంచ్ అయిన అత్యంత ఖరీదైన టీవీలలో షియోమీ టీవీ ఇదే.ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కే సిరీస్ డాల్బీ విజన్ ఫార్మాట్లో ఈ టీవీని లాంచ్ చేశారు.
ఎంఐ క్యూ ఎల్ఈడి టీవీ 75 ధరను మనదేశంలో రూ.1,19,999గా నిర్ణయించారు. అయితే ఇదే సైజులో ఉన్న ఇతర కంపెనీ ధరలతో పోలిస్తే షియోమీ తక్కువ ధరకే ఈ స్మార్ట్ టీవీ ని మనకు అందిస్తుంది. ఈటీవీ కి సంబంధించినటువంటి సేల్స్ మనదేశంలో ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమవుతున్నాయి.ఫ్లిప్ కార్ట్, ఎంఐ ఆన్ లైన్ స్టోర్ లలో కూడా ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.
ఈ అద్భుతమైన స్మార్ట్ టీవీ లో 4కె సిరీస్ యూహెచ్డీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 97 శాతం ఉండగా,120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.ఈ టీవీలో 30W స్టీరియో స్పీకర్ సిస్టంను అందుబాటులో ఉంది. దీనిలో 2 ట్వీటర్లు,4 ఊఫర్లు ఉన్నాయి.
ఈ స్మార్ట్ టీవీని వాయిస్ కమాండ్స్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.ఒక హెచ్డీఎంఐ 2.1 పోర్టు, రెండు హెచ్డీఎంఐ 2.0 పోర్టులు, రెండు యూఎస్బీ 2.0 పోర్టులు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…