ఐటి దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగానికి హైదరాబాద్ నగరానికి చెందిన నర్కుటి దీప్తి ఎన్నికయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ లో ఫోరెన్సిక్ నిపుణులుగా పనిచేస్తున్న డాక్టర్ వెంకన్న కూతురు దీప్తి యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరెడాలో సీటు సాధించారు. ఈ విధంగా అమెరికాకి వెళ్ళిన దీప్తి ఈనెల 2వ తేదీతో ఎంఎస్ పూర్తి చేశారు.
చదువులో ఎంతో రాణిస్తున్న దీప్తి రెండు నెలల క్రితమే యూనివర్సిటీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా దీప్తి మైక్రోసాఫ్ట్, గోల్డ్ మెన్ సాక్స్, అమేజాన్ కంపెనీల్లో ఉద్యోగం సాధించింది. అయితే వీటన్నింటిలో కెల్లా దీప్తి మైక్రోసాఫ్ట్
సంస్థ వైపే మొగ్గు చూపారు.
దీప్తి ప్రతిభను గుర్తించిన మైక్రోసాఫ్ట్ సంస్థ తనకు సంవత్సరానికి అక్షరాల 2 కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని చెల్లిస్తూ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ (ఎస్డీఈ) గ్రేడ్–2 కేటగిరీలో ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలోనే దీప్తి ఈ నెల 17న మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు తీసుకోనున్నారు. ఒక తెలుగు తేజం మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఇంతటి విలువైన ఉద్యోగం సాధించడం ఎంతో గర్వకారణమని చెప్పవచ్చు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…