ఐటి దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగానికి హైదరాబాద్ నగరానికి చెందిన నర్కుటి దీప్తి ఎన్నికయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ లో ఫోరెన్సిక్ నిపుణులుగా పనిచేస్తున్న డాక్టర్ వెంకన్న కూతురు దీప్తి యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరెడాలో సీటు సాధించారు. ఈ విధంగా అమెరికాకి వెళ్ళిన దీప్తి ఈనెల 2వ తేదీతో ఎంఎస్ పూర్తి చేశారు.
చదువులో ఎంతో రాణిస్తున్న దీప్తి రెండు నెలల క్రితమే యూనివర్సిటీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా దీప్తి మైక్రోసాఫ్ట్, గోల్డ్ మెన్ సాక్స్, అమేజాన్ కంపెనీల్లో ఉద్యోగం సాధించింది. అయితే వీటన్నింటిలో కెల్లా దీప్తి మైక్రోసాఫ్ట్
సంస్థ వైపే మొగ్గు చూపారు.
దీప్తి ప్రతిభను గుర్తించిన మైక్రోసాఫ్ట్ సంస్థ తనకు సంవత్సరానికి అక్షరాల 2 కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని చెల్లిస్తూ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ (ఎస్డీఈ) గ్రేడ్–2 కేటగిరీలో ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలోనే దీప్తి ఈ నెల 17న మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు తీసుకోనున్నారు. ఒక తెలుగు తేజం మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఇంతటి విలువైన ఉద్యోగం సాధించడం ఎంతో గర్వకారణమని చెప్పవచ్చు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…