Political News

సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం ఆ నిర్ణయాలను తీసుకుంది.. ఎమ్మెల్యే రోజా

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్ర పరిశ్రమపై తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. సినిమా టికెట్ ధరల విషయంలో నిర్మాతలు, యాజమాన్యాలు, ఎగ్జిబీటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ టికెట్ ధరల విషయంలోనే విసుగుచెంది సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడం కంటే.. ఓటీటీ లో విడుదల చేయడమే సేఫ్ అని భావిస్తున్నారు నిర్మాతలు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు మెగస్టార్ చిరంజీవికి సీఎం జగన్ నుంచి ఆహ్వానం అందింది.

ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదట్లో మెగస్టార్ తో సహా మరికొంత సినీ ప్రముఖులు సీఎంతో చర్చించనున్నారు. కానీ ఈ లోపే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్ లైన్ లో విక్రయించేలా నిర్ణయం తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం మంత్రి పేర్నినాని దీనిపై అధికారికంగా కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

అయితే కొంత మంది ఈ నిర్ణయం ఆమోదయోగ్యంగా ఉందని కొందరు అంటుంటే.. మరికొందరు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయాలవైపు మళ్లింది. ప్రభుత్వం టికెట్లను, మద్యాన్ని అమ్ముకుంటుందని విమర్శలు చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే రోజా దీనిపై తీవ్రంగా స్పందించారు.

ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. సినీ ప్రముఖులు ఆన్ లైన్ లోనే టికెట్లు అమ్మాలని సీఎంను కోరడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని.. అంతేగానీ దీనిపై మరే ఉద్దేశ్యం లేదంటూ రోజా స్పష్టం చేశారు. ఇక త్వరలో సీఎం జగన్ తో సినీ సమస్యలపై మీటింగ్ జరగనున్న నేపథ్యంలో.. ఏ విషయాలపై చర్చించుకుంటారో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఉత్కంఠ పెరుగుతోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago