General News

ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం.. ఆకలితో చిన్నారి కన్నుమూత..

ఏదైనా క్రైమ్ ఘటన జరిగినప్పుడు ఒక శవాన్ని చూస్తేనే గుండెలు అదురుతాయి. అలాంటిది ఒకే ఇంట్లో ఐదుగురు శవాలు కనిపించాయి. అందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోగా.. దానిలో 9 నెలల బాబు మాత్రం ఆకలితో చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బెంగళూరు నగరం బైడరహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బైడరహల్లి ప్రాంతానికి చెందిన శంకర్, భారతి దంపతులు. అతడు జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంట్లో ఏదో చిన్న గొడవ కారణంగా అతడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంట్లో వాళ్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. తర్వాత మూడు రోజుల తర్వాత తన ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. భారతి.. భారతి అని పిలిచినా ఎలాంటి స్పందన లేదు.

కిటికీలు,డోర్లు అన్ని లాక్ చేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్ల సహాయంతో బలవంతంగా తలుపు బద్దలు కొట్టి లోపలకి వెళ్లి చూశాడు. అక్కడ ఆ ఘటన చూసి షాక్ అయ్యాడు. అతడికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. అందులో 9 నెలల కొడుకు కూడా ఉన్నాడు. వాళ్లంతా ఆ ఇంట్లో విగతజీవులా పడి ఉన్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పశ్చిమ డీసీసీ సంజీవ్ పాటిల్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

ఆ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. శంకర్ కు ఇద్దరి కూతుళ్లలో ఒక కూతురు పేరు సించన. ఆమెకు పెళ్లి చేశారు. తన భర్తతో విభేదాల కారణంగా ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఈ వ్యవహారంలో అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. ఇలా ఘోర ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago