అక్కినేని సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుని టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈమె తెలుగింటి కోడలుగా అడుగుపెట్టి మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమంత ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే గత కొంత కాలం నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయనీ, త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.
అయితే వీరిద్దరి గురించి వస్తున్న వార్తలపై ఇటు అక్కినేని కుటుంబం కానీ లేదా సమంత గాని స్పందించకపోవడంతో అభిమానులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. సమంత ఈ మధ్యనే శాకుంతలం సినిమాను పూర్తి చేసుకుని ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ లో ఉన్నారు. అదేవిధంగా నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. కానీ వీరిద్దరూ విడాకులు విషయంపై ఏమాత్రం స్పందించలేదు.
ప్రస్తుతం ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ లో ఉన్న సమంత నిత్యం సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. అయితే ఎక్కువగా సమంత తన పెట్ డాగ్స్ తో ఎంతో సరదాగా గడుపుతోంది. ఈ క్రమంలోనే డాగ్స్ తో ఆమెసరదా సన్నివేశాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన బాధను ఒంటరితనాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సమంత ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటోను షేర్ చేశారు. అందులో సమంత డాగ్ పర్సన్ అనే కొటేషన్ ఉన్న టీ షర్ట్ ధరించారు. ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. ఒక వేళ మీరు గమనించకపోతే.. అనే క్యాప్షన్ జోడించి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆలోచనలో పడేసింది. అసలు ఈ ఫోటోలో దాగి ఉన్న ఆంతర్యం ఏమిటి అంటూ నెటిజన్లు పెద్దఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…