MLC Anantha Babu's driver case comes to the fore again.. Court orders investigation!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు ఆగడం లేదు. గతేడాది ఎన్నికల్లో ఘోర ఓటమితో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి ప్రతీ రోజు ఏదో ఒక విఘాతం ఎదురవుతోంది. తాజాగా మద్యం స్కాం కేసుతో పార్టీకి పలు ఇబ్బందులు తలెత్తుతుండగా, మరోవైపు జగన్ పర్యటనల సమయంలో నమోదైన కేసులపై మాజీ మంత్రుల్ని పోలీసులు విచారణకు పిలవడం చూస్తున్నాం. ఇదే సమయంలో ఇప్పుడు మరో కీలక కేసు మరోసారి జోరందుకుంది. అదే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు.
2022లో వెలుగులోకి వచ్చిన ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రమణ్యంను వ్యక్తిగత కలహాల నేపథ్యంలో కొట్టి చంపి, మృతదేహాన్ని మూటగట్టి తన ఇంట్లోనే పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతబాబు ఈ హత్యను చేసినట్టు పోలీసులు చేపట్టిన విచారణలో అంగీకరించారు కూడా. అనంతరం ఈ కేసు కొంతకాలం నిశ్శబ్దంగా కొనసాగింది. అయితే ఇటీవలే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసుపై మరింత దృష్టి సారించింది.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి సర్కార్, విచారణను మరోసారి వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వేయాలంటూ వినతిని సమర్పించింది. కోర్టు దీనిపై విచారణ జరిపి విభిన్న కోణాల్లో దర్యాప్తుకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు, 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు అనంతబాబును మరోసారి అరెస్టు చేసి విచారణ జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై బయట ఉన్నారు.
ఈ కేసు పునఃప్రారంభం రాజకీయంగా కూడా కీలక పరిణామాలకు దారితీయనుంది. ముఖ్యంగా ఎస్సీ వర్గాల్లో తమ పట్టు పెంచుకోవాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ దీనిని సీరియస్గా తీసుకుంటోంది. న్యాయ ప్రక్రియలో ఎలాంటి లోపాలు ఉండకుండా చూసేందుకు న్యాయ నిపుణుడు ముప్పాళ్ల సుబ్బారావు సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది.
ఈ కేసు త్వరలో తుది మలుపు తిరిగే అవకాశముండగా, అనంతబాబుకు నేరం నిరూపితమైతే వైసీపీకి ఇది మరో దెబ్బగా మిగిలే అవకాశం కనిపిస్తోంది.
కడుపు ఉబ్బరం (బ్లోటింగ్) సమస్య చాలా మందికి తరచూ ఎదురయ్యే జీర్ణ సమస్యల్లో ఒకటి. ఎక్కువగా తినడం, వేడి వాతావరణం,…
పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా (గట్ మైక్రోబయోమ్) ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి ఇప్పటివరకు ఎక్కువగా జీర్ణవ్యవస్థ కోణంలోనే చర్చించేవారు.…
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…