MLC Anantha Babu's driver case comes to the fore again.. Court orders investigation!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు ఆగడం లేదు. గతేడాది ఎన్నికల్లో ఘోర ఓటమితో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి ప్రతీ రోజు ఏదో ఒక విఘాతం ఎదురవుతోంది. తాజాగా మద్యం స్కాం కేసుతో పార్టీకి పలు ఇబ్బందులు తలెత్తుతుండగా, మరోవైపు జగన్ పర్యటనల సమయంలో నమోదైన కేసులపై మాజీ మంత్రుల్ని పోలీసులు విచారణకు పిలవడం చూస్తున్నాం. ఇదే సమయంలో ఇప్పుడు మరో కీలక కేసు మరోసారి జోరందుకుంది. అదే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు.
2022లో వెలుగులోకి వచ్చిన ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రమణ్యంను వ్యక్తిగత కలహాల నేపథ్యంలో కొట్టి చంపి, మృతదేహాన్ని మూటగట్టి తన ఇంట్లోనే పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతబాబు ఈ హత్యను చేసినట్టు పోలీసులు చేపట్టిన విచారణలో అంగీకరించారు కూడా. అనంతరం ఈ కేసు కొంతకాలం నిశ్శబ్దంగా కొనసాగింది. అయితే ఇటీవలే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసుపై మరింత దృష్టి సారించింది.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి సర్కార్, విచారణను మరోసారి వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వేయాలంటూ వినతిని సమర్పించింది. కోర్టు దీనిపై విచారణ జరిపి విభిన్న కోణాల్లో దర్యాప్తుకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు, 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు అనంతబాబును మరోసారి అరెస్టు చేసి విచారణ జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై బయట ఉన్నారు.
ఈ కేసు పునఃప్రారంభం రాజకీయంగా కూడా కీలక పరిణామాలకు దారితీయనుంది. ముఖ్యంగా ఎస్సీ వర్గాల్లో తమ పట్టు పెంచుకోవాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ దీనిని సీరియస్గా తీసుకుంటోంది. న్యాయ ప్రక్రియలో ఎలాంటి లోపాలు ఉండకుండా చూసేందుకు న్యాయ నిపుణుడు ముప్పాళ్ల సుబ్బారావు సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది.
ఈ కేసు త్వరలో తుది మలుపు తిరిగే అవకాశముండగా, అనంతబాబుకు నేరం నిరూపితమైతే వైసీపీకి ఇది మరో దెబ్బగా మిగిలే అవకాశం కనిపిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…