కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త ఉద్యోగాల కోసం ఉద్యోగాలు కోల్పోయిన వారితో పాటు నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దేశంలో నిరుద్యోగుల రేటు అంతకంతకూ పెరుగుతుండటంతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త స్కీమ్ ను అమలు చేయనుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా మూడు లక్షల జాబ్ ప్రొవైడర్లను తీర్చిదిద్దనుందని సమాచారం
కేంద్రం మూడు లక్షల మంది జాబ్ ప్రొవైడర్ల ద్వారా లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. నిరుద్యోగులకు జాబ్ ప్రొవైడర్ల ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. యువతకు ఎక్కువగా కేంద్రం ప్రాధాన్యత ఇవ్వనుందని ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగుల కష్టాలకు దాదాపు చెక్ పెట్టనుందని సమాచారం. ఇప్పటికే కేంద్రం ఇందుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించింది.
స్కిల్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇప్పటికే ఈ స్కీమ్ కు సంబంధించిన నివేదికలను సిద్ధం చేసిందని త్వరలో కేంద్రం ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలులో రాష్ట్రాల సహకారం తీసుకోనుందని.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంట్రప్రెన్యూర్లను గుర్తించి కేంద్రానికి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది.
పీఎం ఉద్యం మిత్రా ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ పేరుతో మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేయనుందని తెలుస్తోంది. ఎంట్రప్రెన్యూర్లకు కేంద్రం సంవత్సరంన్నర శిక్షణ ఇవ్వనుందని సమాచారం.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…